Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హైదరాబాద్ లో థియేటర్కు బాంబు బెదిరింపు
ఈ నెల 21వ తేదీన హైదరాబాదులోని దిల్షుక్నగర్లో జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో 16 మంది మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్ల వద్ద ఈ పేలుళ్లు సంభవించాయి.మక్బూల్, ఇమ్రాన్ 2012 జులైలో దిల్షుక్నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఎ అనుమానిస్తోంది. పాకిస్తాన్లో ఉంటున్న ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ సూచన మేరకు వారిద్దరు రెక్కీ నిర్వహించారని ఎన్ఐఎ అనుమానిస్తోంది. వారిద్దరినీ విచారిస్తే దిల్షుక్నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియగలవని ఎన్ఐఎ భావిస్తోంది.
గురువారం రోజు ఉగ్రవాదాలు అరగంటలోపే పేలుళ్ల పని పూర్తి చేసినట్లుగా భావిస్తున్నారు. సమీపంలో బస చేసిన ఉగ్రవాదులు కోణార్క్, వెంకటాద్రి థియేటర్లలో రెండు నిమిషాల వ్యవధిలో పేలుళ్లు జరిపారు. సైకిళ్లు తీసుకు వచ్చి పేలుళ్లు జరపడం ఇదంతా కేవలం అరగంటలోనే పూర్తి చేసినట్లుగా భావిస్తున్నారు.