Don't Miss!
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- News భోజనాలున్నాయమ్మా వెళ్లొద్దు.. విజయసాయికి షాక్; ఇజ్జత్ తీసిన టీడీపీ!!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నందమూరి వర్సెస్ అక్కినేని.. పోటాపోటీగా.. నువ్వా నేనా?
అగ్రహీరోలు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం తరచుగా జరుగుతుంటాయి. కొన్ని పరిస్థితుల కారణంగా తప్పనిసరిగా రిలీజ్ క్లాష్ జరుగుతుంటాయి. టాలీవుడ్లో కంటే బాలీవుడ్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఇలాంటి పరిస్థితి ఎదురైనా నిర్మాతల మధ్య అవగాహనతో పోటాపోటీ రిలీజ్ ఆగిపోయింది. ఈ ముప్పు ఇలా తప్పించుకోగానే .. నాగార్జున, నందమూరి కల్యాణ్రామ్ మధ్య మరో పోటాపోటీ రిలీజ్ టాలీవుడ్లో అనివార్యమైనట్టు కనిపిస్తున్నది.
నా నువ్వే కల్యాణ్రామ్
నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా భాటియా నటిస్తున్న నా నువ్వే చిత్రం పూర్తి కావొచ్చింది. ఈ చిత్రానికి యాడ్ ఫిలిం డైరెక్టర్ జయేంద్ర పంచపకేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఆఫీసర్గా నాగార్జున అక్కినేని
సంచలన విజయం సాధించిన శివ తర్వాత నాగార్జున అక్కినేని, రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆఫీసర్. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. శివ చిత్రానికి ధీటుగా ఈ సినిమాకు వర్మ మెరుగులు దిద్దుతున్నారు.
Recommended Video
మే 25న పోటాపోటీగా రిలీజ్
అయితే నందమూరి వారసుడు కల్యాణ్రాం చిత్రం నా నువ్వే, అక్కినేని వారసుడు నాగార్జున చిత్రం ఆఫీసర్ చిత్రాలు ఒకే రోజున రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలను మే 25న విడుదల చేయనున్నట్టు ప్రకటన వెలువడింది.
రాజీపడిన మహేష్, అల్లు అర్జున్
గతంలో ఏప్రిల్ మూడోవారంలో ఒకే రోజున అంటే ఏప్రిల్ 27న ప్రిన్స్ మహేష్బాబు భరత్ అను నేను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రాలు పోటాపోటీగా రిలీజ్ చేయాలని ప్రకటన చేశారు. అయితే నిర్మాతల మధ్య జరిగిన చర్చల వలన ఏప్రిల్ 20న భరత్ అను నేను, మే 4న నా పేరు సూర్య సినిమాలను రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.