తిరుమలలో బోయపాటి....బాలయ్య మూవీకి మొక్కు!

By Bojja Kumar

తిరుమల : సినీ దర్శకుడు బోయపాటి శ్రీను శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 3న బాలయ్యతో కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రారంభం నేపథ్యంలోనే అంతా శుభం జరుగాలని బోయపాటి శ్రీను ఆ ఏడుకొండల వాడికి మొక్కు చెల్లించి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది.

సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన చేసే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు.

ఈ చిత్రాన్ని 2014 సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాతికి గతంలో ఎన్నో హిట్స్ బాలకృష్ణకు వచ్చి ఉండటంతో అప్పుడే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ అనుకుని చివరకు జయసింహ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. జయ సింహ లో సింహ ఉండటం సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొదట ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ ఇప్పటికే వేరే నిర్మాత రిజిస్టర్ చేసుకోవడంతో పాటు దాన్ని బాలయ్య కోసం ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో 'జయసింహ' టైటిల్ తో ముందుకెళ్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X