Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘ది ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం’ మూవీపై వివాదం
చలం 1937లో రాసిన 'బ్రాహ్మణీకం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాత చెబుతున్నారు. చలం వంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం పేరును అడ్డుపెట్టుకుని, బ్రాహ్మణ స్త్రీలను కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.
మరో వైపు సెన్సార్ బోర్డుపై కూడా బ్రహ్మణ సంఘాలు ఫైర్ అయ్యాయి. ఇలా ఒక కులం ప్రస్తావనతో టైటిల్ పెట్టి సినిమాలు తీస్తుంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తుందని, ఇలాంటి వాటికి ఎలా అనుమతి ఇచ్చారని ఆ సంఘం నేతలు మండి పడుతూ...సినిమాను నిషేదించాలని, నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘాల నేతలు మాట్లాడుతూ...సినిమా నిషేదించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. బ్రాహ్మనిజం చిత్రానికి దర్శకత్వం, నిర్మాత, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, లిరిక్స్ ఇలా అన్ని విభాగాలు జీటీ పూరి అనే ఒకే వ్యక్తి హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.