Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'బాద్షా' నిర్మాత బండ్ల గణేష్ పై కేసు
హైదరాబాద్: ఎన్టీఆర్ 'బాద్షా' ఆడియో విడుదల తొక్కిసలాట ఘటనపై రాయదుర్గం పీఎస్లో కేసు నమోదైంది. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్, తదితరులపై 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా ఆడియో విడుదల వేడుకలో అపశ్రుతి చోటుచేసుకొంది. తొక్కిసలాటలో వరంగల్లోని ఉర్సుగుట్టకు చెందిన ముక్కల రాజు(22)అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. మరికొందరికి గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే... ఆదివారం రాత్రి హైదరాబాద్ శివారు నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియో ఆవరణలో నిర్వహించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఎన్టీఆర్ ప్రాంగణానికి వస్తున్నట్లు ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ప్రవేశద్వారం వద్దకు చేరుకొన్నారు. ఆ సమయంలో తొక్కిసలాట జరగటంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయారు. వరంగల్లోని ఉర్సుగుట్టకు చెందిన ముక్కల రాజు(22)అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. మరికొందరికి గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్ తదితరులపై రాయదుర్గ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిమితికి మించి పాస్లను జారీ చేయడంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 3 వేల వీవీఐపీ సీట్ల సామర్థ్యం ఉండగా 20 వేల మందికి పైగా పాస్లు మంజూరు చేసినట్లు తెలిసింది. కార్యక్రమానికి అనుమతి ఉన్నప్పటికీ ఎక్కువ పాస్లు జారీ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సైబరాబాద్ పోలీసుకమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.