Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ధనుష్ మూవీ ‘రాంఝానా’పై పాక్లో నిషేదం
కాగా...ఈచిత్రంపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొంటూ పాకిస్థాన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు 'రాంఝానా' ప్రదర్శనను అడ్డుకుంది. పాక్లో ఎక్కడ కూడా చిత్రాన్ని ప్రదర్శించడానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
చిత్రంలో జోయా హైదర్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో సోనమ్ కపూర్ నటించింది. ఇందులో జోయా హైదర్ తండ్రి ఓ ప్రొఫెసర్. తండ్రికి కూతురంటే ఎంతో ప్రేమ. మతం కట్టుబాట్లను పక్కన పెట్టి కూతురుకు పూర్తి స్వేచ్ఛని ఇస్తాడు. ఈ క్రమంలో జోయా హైదర్ ఓ బ్రాహ్మణ అబ్బాయితో ప్రేమలోపడుతుంది. ఆ తరవాత కథ ఎలా ముందుకు సాగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది.
మస్లిం అమ్మాయిన హిందూ అబ్బాయిని ప్రేమించడం అనే అంశం ఉన్నందు వల్లనే ఈ చిత్రాన్ని పాకిస్తాన్ సెన్సార్ బోర్డు నిషేదించింది. పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ఇలాంటి చర్యకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సల్మాన్ ఖన్ 'ఏక్ థా టైగర్', సైఫ్ అలీ ఖాన్ 'ఏజెంట్ వినోద్' లాంటి చిత్రాలను కూడా పాకిస్థాన్ బోర్డు నిషేదించిన సంగతి తెలిసిందే.