Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శ్రీహరి మరణవార్త నమ్మలేక పోతున్నా: చిరంజీవి
హైదరాబాద్: శ్రీహరి మరణవార్త నమ్మలేక పోతున్నాను అని మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. ఈ విషయం తెలిసి ఎంతో దిగ్ర్భాంతికి గురయ్యానని, ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరలేనిదని చిరంజీవి వ్యాఖ్యానించారు. శ్రీహరి మా కుటుంబానికి ఎంతో ఆప్తుడని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రముఖ నటుడు మోహన్ బాబు శ్రీహరి మరణ వార్తపై స్పందిస్తూ.....శ్రీహరి నా తమ్ముడు లాంటి వాడు, ఆయన మరణ వార్త షాక్కు గురి చేసింది. ఎంతో మంచి వ్యక్తి. నాకుటుంబంలో ఒకటిగా మెలిగిన వాడు. ఆయన లేని లోటు తీరలేనిది అని వ్యాఖ్యానించారు మోహన్ బాబు.
నటుడు ఏవీఎస్ మాట్లాడుతూ....నాకు వచ్చిన లివర్ సమస్యే శ్రీహరికి వచ్చింది. ఆయన ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళతాడని అసలు అనుకోలేదు. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే వ్యక్తి. గొప్ప నటుడు. ఆయన ఇక లేరనే విషయం తెలుసుకుని దిగ్ర్భాంతికి గురయ్యాను అని వెల్లడించారు.
శ్రీహరి ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసే వారు అని ఆయన సన్నిహితులు అంటున్నారు. తన కూతురు అక్షర జ్ఞాపకార్థం పౌండేషన్ స్థాపించి శామీర్ పేట మండలంలోని గ్రామాల్లో పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీహరి మృతి పట్ల చలన చిత్ర ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. సంతాపం వ్యక్తం చేసారు.