Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మోహన్ బాబు ఒక అడుగు వెనక్కు వేసి..చిరంజీవి
మోహన్ బాబు ఒక అడుగు వెనక్కు వేసి తన తనయను నిర్మాతగా నిలబెట్టి ప్రోత్సహించారు. పిల్లలను ప్రోత్సహించడంవల్ల కొత్తదనంతో కూడిన సినిమాలు వచ్చే అవకాశం ఉంది అన్నారు మెగాస్టార్ చిరంజీవి. 'ఝుమ్మంది నాదం' ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా హాజరైన చిరంజీవి ఇలా స్పందించారు. ఆయన మాటల్లోనే...అనుకునో లేక అనుకోకుండానో వేరే రంగం (రాజకీయ)లోకి అడుగుపెట్టాను. అక్కడ మానసిక ఒత్తిడి తప్పదు. నేనేదో ఇక్కడ 'మిస్' అవుతున్నానని కాదు. రాజకీయాల్లోకి వెళ్లినందుకు నో రిగ్రెట్స్.
కానీ ఈ వేడుక నా కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతున్న భావనను కలిగిస్తోంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మోహన్ బాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల క్రితం వేటూరి కలం నుంచి జాలువారిన పాట 'ఝుమ్మంది నాదం'. ఇప్పుడు అదే పాటనే టైటిల్ గా చేసుకుని ఈ చిత్రం రూపొందించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం విజయం తథ్యం' అని చిరంజీవి అన్నారు. మనోజ్, తాప్సి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించిన చిత్రం 'ఝుమ్మంది నాదం'. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన పాటలు ఆదిత్య మ్యూజిక్ వారు పంపిణీ చేస్తున్నారు.