Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'బ్రూస్లీ' సెన్సార్ న్యూస్ : చిరు కనపడేది 3 నిముషాలు కాదు
హైదరాబాద్: రామ్చరణ్, రకుల్ప్రీత్ సింగ్లు జంటగా నటిస్తున్న 'బ్రూస్లీ' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆయన కేవలం 3 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్లో కనిపించనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ వారు సైతం తమ అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే ఈ రోజు సెన్సార్ 12 గంటలుకు జరిగింది. ఈ సందర్బంగా తెలిసిన విషయం ఏమిటంటే చిరంజీవి ఉండేది నాలుగు నిముషాలని విశ్వసనీయ సమాచారం .
అలాగే చిరంజీవి దాదాపు ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత తమ ప్రాజెక్టులో పనిచేయడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత. థమన్ సంగీతం అందిస్తున్నారు. 'బ్రూస్లీ' గీతాలను అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు.
చిరు ఎంట్రీపై రామ్ చరణ్ మాట్లాడుతూ...
''డాడీ ఈ చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని సెట్లో చూస్తుంటే కొత్త ఉత్సాహం వస్తోంది. ఆయన తదుపరి చిత్రానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ ఓ టీజర్ లాంటిది మాత్రమే'' అంటూ రామ్చరణ్ స్పందించారు.
రామ్ చరణ్, చిరంజీవి లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను మూడు రోజుల పాటు తీస్తారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఈ చిత్రంలో చేయబోయే సీన్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.
లారెన్స్ స్టైల్ సినిమాలో చేసినట్లుగానే చిరంజీవి ఈ సినిమాలో రామ్ చరణ్ ని క్లైమాక్స్ ముందు ఓ కష్టం నుంచి బయిటపడేస్తారు. రకుల్ ప్రీతి ని విలన్స్ నుంచి కాపాడటానికి చిరంజీవి హెల్ప్ చేస్తారు. రామ్ చరణ్ వంటి హీరోకి హెల్ప్ చేయగలవారు ఎవరా అని ఆలోచించి చిరంజీవి అయితేనే బెస్ట్ అని ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి తన నిజ జీవితలో లాగానే మెగాస్టార్ చిరంజీవి గా సినిమా హీరోగా కనిపిస్తారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.
వచ్చే నెల 2న పాటల్ని, 16న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని ఓ పాట కోసం ఏకంగా రూ.1.7 కోట్లు ఖర్చు చేశారట. ఈ పాటే కాదు, సినిమా మొత్తం గ్రాండ్గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.