Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'అభినందన' దర్శకుడు అశోక్ కుమార్ ఇక లేరు
చెన్నై : ప్రముఖ సినిమాటోగ్రాఫర్, అభినందన,నీరాజనం వంటి అభిరుచి గల చిత్రాల దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ మృతి చెందారు. ఆయన గత ఆరు నెలలుగా గుండెకు సంభందించిన ఆరోగ్య సమస్యలతో భాధపడుతున్నారు. చెన్నై,హైదరాబాద్ లలోని హాస్పటిల్స్ లో వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఆరోగ్యం మరీ విషమించటంతో కొన్ని రోజుల క్రితమే ఇంటికి తీసుకు వచ్చారు. పలు భారతీయ భాషల్లో ఆయన దాదాపు వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రాహకుడుగా పనిచేసారు. జీన్స్ వంటి చిత్రాలకు సైతం ఆయన చేతిలో రూపుదిద్దుకున్నవే.
పలు భాషల్లో 100 పైగా చిత్రాలకు ఫోటోగ్రఫిని అశోక్ కుమార్ అందించారు. 'నెంజాతాయ్ కిల్లతే' చిత్రానికి 1980లో అశోక్ కుమార్ కు జాతీయ అవార్డు లభించింది. హిందీలో సచ్చాప్యార్, బ్యాక్ వాటర్ అనే ఆంగ్ల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన అభినందన (తెలుగు), ఆంద్రూ పీతా మజాయిల్ (తమిళ), కామగ్ని (హిందీ) మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులను సంపాదించిపెట్టాయి.
అశోక్ కుమార్ తెలుగు తమిళ భాషల్లో కలిపి 100కి పైగా సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడమే కాకుండా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు.