Don't Miss!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సినీ రచయిత కులశేఖర్కు ఆరు నెలలు జైలు శిక్ష
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. సినిమా కథలు, పాటలు రాసే హైదరాబాద్కు చెందిన టి.పి.కులశేఖర్.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉన్న త్రిపురసుందరి ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి ఉన్న 350 గ్రాముల వెండి కిరీటాన్ని దొంగిలించాడు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.
పాటల రచయితగా అతి తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న కులశేఖర్ ఓ ఐదేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యంతో భాధ పడ్డారు. మెదడుకి సంభందించి వ్యాధితో భాధ పడుతున్న ఆయన ఆమధ్య కోమాలోకి కూడా వెళ్ళారని చెప్పుకున్నారు. కొంతకాలం ఎవరిని గుర్తించలేని స్ధితిలో ఉన్నారు. అయితే నిపుణలైన డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకుని కోలుకున్నారు.
ఇక జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కులశేఖర్ ..తేజ,ఆర్.పి.పట్నాయిక్ కాంబినేషన్ లో వరస హిట్ సాంగ్స్ రాసారు. ఇప్పటికి నువ్వు-నేను సినిమాలో ఆయన రాసిన పాటలు ఎక్కడో చోట వినపడుతూనే ఉంటాయి. అలాగే ఆయన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు హీరోగా పరిచయం చేస్తూ రాసా ప్రేమ లేఖరాసా అంటూ ..ఓ ప్రేమ కథను డైరక్ట్ చేసారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం పొందింది. ఆ మధ్య ఓ టీవీ ఛానెల్ లో కూడా పోగ్రామ్ కి వ్యాఖ్యాతగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. అయితే కులశేఖర్..గతంలోనూ సెల్ పోన్ వంటి దొంగతనాలు చేస్తున్నాడని ఇండస్ట్రీలో వినపడింది.