Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పెళ్ళిచూపులు రిజల్ట్ రిపీట్ అవుతుందా..?? మంచి అంచనాలతో "మెంటల్ మదిలో"
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మెంటల్ మదిలో చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు.
శ్రీ విష్ణు ఈ మధ్య కాలం లో టాలీవుడ్ లోకి వచ్చిన యువ హీరోల్లో మంచి ఇంప్రెషన్ కొట్టేసిన నటుడు. ప్రేమ ఇష్క్ కాదల్, నల దమయంతి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందతున్న ఈ చిత్రానికి మెంటల్ మదిలో అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక క్యాప్షన్ గా మనవి ఆలకించరాదే అని పెట్టారు.
న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో కథ గురించి చెప్పిన విషయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. 'పెళ్ళిచూపులు' తరహాలోనే 'మెంటల్ మదిలో' కూడా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను. వివేక్ ఆత్రేయ ఓ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు' అన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. 'సురేష్ బాబుగారు మా 'మెంటల్ మదిలో' ట్రైలర్ ను విడుదల చేసి.. క్వాలీటీ అండ్ కంటెంట్ చూసి మమ్మల్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీం అంతా కూడా సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. విడుదల తేదీని ప్రకటిస్తాం' అన్నారు.