Just In
- 24 min ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 1 hr ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 2 hrs ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 3 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
Don't Miss!
- Lifestyle
ఈ పరోక్ష లక్షణాలు మీకు బిడ్డ పుట్టకపోవడానికి హెచ్చరిక కావచ్చు ... జాగ్రత్త ...!
- News
50 దేశాలకు విస్తరించిన యూకే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ .. ఇండియాలో కేసులు ఎన్నంటే
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాన్న మాట వినకుండా చిరు, పవన్ దారిలో వరుణ్ తేజ్
హైదరాబాద్: పెద్దలు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంత మంది పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలని కలలుకంటే మరికొందరు యాక్టర్లు, డైరెక్టర్లుగా చేయాలనుకుంటారు. అయితే ఈ జనరేషన్ పిల్లలు మాత్రం పెద్దల మాట వినకుండా తమకు నచ్చిన దారిలో వెళతారు. తాజాగా వరుణ్ తేజ్ విషయంలో ఇదే జరిగింది. నాగబాబు తన కొడుకుని డైరెక్టర్ చేయాలనుకున్నాడు. కానీ వరుణ్ తేజ్కి అది నచ్చలేదు. పెదనాన్న, బాబాయ్ దారిలో నడిచాడు.
ఈ విషయమై వరుణ్ తేజ్ మాట్లాడుతూ..‘నాన్న నన్ను డైరెక్టరుగా చూడాలనుకున్నాడు. నేను మంచి సినిమాలు తీస్తే చూడాలని ఆశపడ్డాడు. కానీ నాకు ఆ రంగంపై ఆసక్తి ఉండేది కాదు. పెదనాన్న, బాబాయ్ ప్రభావం నాపై బాగా ఉండేది. అందుకే వారి దారిలోనే నడిచాను. నటున్ని అయ్యాను' అని చెప్పుకొచ్చారు.
నన్ను చాలా భయపెట్టే విషయం ఒకటుంది అది డ్యాన్సులు. నా దగ్గరకొచ్చే చాలామంది అభిమానులు చరణ్ అన్నలాగా, బన్నీలాగా డ్యాన్సులు వేయమంటారు. కానీ వాళ్ళలా చేయడం నావల్ల కాదు. నిజానికి చరణ్, బన్నీలతో తనకు చనువు తక్కువేనని, చిన్నప్పటి నుండి శ్రీజ(చిరంజీవి చిన్న కూతురు), సాయిధరమ్ తేజ్ తోనే ఎక్కువగా ఆడుకునే వాడినని తెలిపాడు.

వరుణ్ తేజ్ ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తొలి చిత్రంతో వరుణ్ తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం ప్రారంభం అయింది.
ఈ చిత్రానికి ‘కంచె' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటించింది.