Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘రాంబాబు’ వివాదం పై దగ్గుపాటి రానా
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' పై తెలంగాణాలో నిరసనలు వ్యక్తం అయి వివాదంలో ఇరుక్కుని బయిటపడిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఏ తెలుగు హీరో కూడా సాహసించి ఈ చిత్రం వివాదంపై మాట్లాడటానికి సాహసించలేదు. అయితే దగ్గుపాటి రానా మాత్రం స్పందించారు. తన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురం చిత్రం విడుదల సందర్బంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదంపై తన అభిప్రాయాలు తెలియచేసారు.
రానా మాటల్లో... 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై వచ్చిన వ్యతిరేకత ఏమాత్రం బాలేదు. జగన్ (పూరీ జగన్నాథ్) మంచి దర్శకుడు, సాధారణంగా తన చిత్రాల్లో తనదైన ఫన్ తో పంచ్ లు వేస్తారు. ఏ దర్శకుడూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడానికి సినిమాలు తీయరు. చిత్రాలనేవి ఓ కళారూపం. దర్శకుడు ఏదైనా సమకాలీన అంశాన్ని చిత్రంలో స్పృశిస్తే అందులో తప్పేంటి? ఇంకాచెప్పాలంటే దాని మంచిచెడ్డల్ని నిర్ణయించి సర్టిఫీకెట్ ఇచ్చేందుకు సెన్సార్బోర్డు వుంది. ఆ చిత్రంలో విలన్ పాత్రకు నా పేరు పెడుతున్నట్టు జగన్ నాతో చెప్పారు. ఆ చిత్రం వల్ల ఎవరైనా బాధప డాల్సి వస్తే ముందది నేనే అవాలి మరి!! అన్నారు.
కృష్టం వందే జగద్గురుం చిత్రం దీపావళికి విడుదల కాబోతోంది. ఈ చిత్రం గురించి చెపుతూ...'ఇది నా ఆరో చిత్రం, బహుశా ఇప్పటి వరకూ చేసిన వాటిలో ఇదే పెద్దది అవుతుందేమోకూడా. ఇందులో నా పాత్ర పేరు బి.టెక్ బాబు. సురభి నాటక కళాకారుడిని. కాని ఈ పాత్రకి నాటకాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అమెరికా వెళ్లి చదువుకోవాలన్నది కల. అయితే, చివరిసారినాటకం వేయడానికి బళ్లారి వెళ్లాల్సి వస్తుంది. ఆ సంఘటన అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ రకంగా ఆ పాత్ర తన గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి ఆలోచించే క్రమంలో ఆ పాత్ర రూపుదిద్దుకుంటుంది.' అన్నారు.
హీరోయిన్ నయనతార గురించి చెపుతూ... ఈ చిత్రం మొదలు పెట్టినప్పుడు హిరోయిన్ ఎవరని ఏమీ అనుకోలేదు. తరువాత, కథ ముందుకు వెళ్తున్న కొద్ది, హీరోయిన్ పాత్ర కూడా పెరిగింది. ఆప్పుడు, నేను, క్రిష్ కూడా బాగా చేయగలిగినవాళ్ళు ఈ పాత్రకు కావాలనుకున్నాం. నయనతార మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటుంది అని తెలిసింది. అంతే, ఆమె కాకపోతే ఈ పాత్రకు ఇంకెవరూ సరిపోరు అనిపించింది. ఇందులో ఆమె ఓ జర్నలిస్టు. బళ్లారి ప్రాంతానికి వెళ్లి, అక్కడి సమస్యలు తెలుసుకుంటుంది. ఇందులో, ఆమె చేసిన పాత్ర చాలా ముఖ్యమైంది, బలమైంది అన్నారు.