twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాంబాబు’ వివాదం పై దగ్గుపాటి రానా

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' పై తెలంగాణాలో నిరసనలు వ్యక్తం అయి వివాదంలో ఇరుక్కుని బయిటపడిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఏ తెలుగు హీరో కూడా సాహసించి ఈ చిత్రం వివాదంపై మాట్లాడటానికి సాహసించలేదు. అయితే దగ్గుపాటి రానా మాత్రం స్పందించారు. తన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురం చిత్రం విడుదల సందర్బంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదంపై తన అభిప్రాయాలు తెలియచేసారు.

    రానా మాటల్లో... 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై వచ్చిన వ్యతిరేకత ఏమాత్రం బాలేదు. జగన్‌ (పూరీ జగన్నాథ్‌) మంచి దర్శకుడు, సాధారణంగా తన చిత్రాల్లో తనదైన ఫన్ తో పంచ్ లు వేస్తారు. ఏ దర్శకుడూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడానికి సినిమాలు తీయరు. చిత్రాలనేవి ఓ కళారూపం. దర్శకుడు ఏదైనా సమకాలీన అంశాన్ని చిత్రంలో స్పృశిస్తే అందులో తప్పేంటి? ఇంకాచెప్పాలంటే దాని మంచిచెడ్డల్ని నిర్ణయించి సర్టిఫీకెట్‌ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డు వుంది. ఆ చిత్రంలో విలన్ పాత్రకు నా పేరు పెడుతున్నట్టు జగన్‌ నాతో చెప్పారు. ఆ చిత్రం వల్ల ఎవరైనా బాధప డాల్సి వస్తే ముందది నేనే అవాలి మరి!! అన్నారు.

    కృష్టం వందే జగద్గురుం చిత్రం దీపావళికి విడుదల కాబోతోంది. ఈ చిత్రం గురించి చెపుతూ...'ఇది నా ఆరో చిత్రం, బహుశా ఇప్పటి వరకూ చేసిన వాటిలో ఇదే పెద్దది అవుతుందేమోకూడా. ఇందులో నా పాత్ర పేరు బి.టెక్‌ బాబు. సురభి నాటక కళాకారుడిని. కాని ఈ పాత్రకి నాటకాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అమెరికా వెళ్లి చదువుకోవాలన్నది కల. అయితే, చివరిసారినాటకం వేయడానికి బళ్లారి వెళ్లాల్సి వస్తుంది. ఆ సంఘటన అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ రకంగా ఆ పాత్ర తన గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి ఆలోచించే క్రమంలో ఆ పాత్ర రూపుదిద్దుకుంటుంది.' అన్నారు.

    హీరోయిన్ నయనతార గురించి చెపుతూ... ఈ చిత్రం మొదలు పెట్టినప్పుడు హిరోయిన్‌ ఎవరని ఏమీ అనుకోలేదు. తరువాత, కథ ముందుకు వెళ్తున్న కొద్ది, హీరోయిన్‌ పాత్ర కూడా పెరిగింది. ఆప్పుడు, నేను, క్రిష్‌ కూడా బాగా చేయగలిగినవాళ్ళు ఈ పాత్రకు కావాలనుకున్నాం. నయనతార మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటుంది అని తెలిసింది. అంతే, ఆమె కాకపోతే ఈ పాత్రకు ఇంకెవరూ సరిపోరు అనిపించింది. ఇందులో ఆమె ఓ జర్నలిస్టు. బళ్లారి ప్రాంతానికి వెళ్లి, అక్కడి సమస్యలు తెలుసుకుంటుంది. ఇందులో, ఆమె చేసిన పాత్ర చాలా ముఖ్యమైంది, బలమైంది అన్నారు.

    English summary
    "Jagan is a good director who uses his wit in a film. No director would make a film to hurt people’s sentiments. And, films are a form of art — if a director uses any topic of relevance, what’s the harm in that? Furthermore, there is the Censor Board, which is present to certify a film. Jagan had told me that he would be borrowing my name for the villain in the film. If anyone should be offended by the film, it should be me!!" Said Daggupati Rana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X