Don't Miss!
- News సీఎం జగన్ వద్దకు భూమా అఖిల ప్రియ.. తరువాత ఏం జరిగిందంటే..!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
‘రాంబాబు’ వివాదం పై దగ్గుపాటి రానా
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' పై తెలంగాణాలో నిరసనలు వ్యక్తం అయి వివాదంలో ఇరుక్కుని బయిటపడిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఏ తెలుగు హీరో కూడా సాహసించి ఈ చిత్రం వివాదంపై మాట్లాడటానికి సాహసించలేదు. అయితే దగ్గుపాటి రానా మాత్రం స్పందించారు. తన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురం చిత్రం విడుదల సందర్బంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదంపై తన అభిప్రాయాలు తెలియచేసారు.
రానా మాటల్లో... 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై వచ్చిన వ్యతిరేకత ఏమాత్రం బాలేదు. జగన్ (పూరీ జగన్నాథ్) మంచి దర్శకుడు, సాధారణంగా తన చిత్రాల్లో తనదైన ఫన్ తో పంచ్ లు వేస్తారు. ఏ దర్శకుడూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడానికి సినిమాలు తీయరు. చిత్రాలనేవి ఓ కళారూపం. దర్శకుడు ఏదైనా సమకాలీన అంశాన్ని చిత్రంలో స్పృశిస్తే అందులో తప్పేంటి? ఇంకాచెప్పాలంటే దాని మంచిచెడ్డల్ని నిర్ణయించి సర్టిఫీకెట్ ఇచ్చేందుకు సెన్సార్బోర్డు వుంది. ఆ చిత్రంలో విలన్ పాత్రకు నా పేరు పెడుతున్నట్టు జగన్ నాతో చెప్పారు. ఆ చిత్రం వల్ల ఎవరైనా బాధప డాల్సి వస్తే ముందది నేనే అవాలి మరి!! అన్నారు.
కృష్టం వందే జగద్గురుం చిత్రం దీపావళికి విడుదల కాబోతోంది. ఈ చిత్రం గురించి చెపుతూ...'ఇది నా ఆరో చిత్రం, బహుశా ఇప్పటి వరకూ చేసిన వాటిలో ఇదే పెద్దది అవుతుందేమోకూడా. ఇందులో నా పాత్ర పేరు బి.టెక్ బాబు. సురభి నాటక కళాకారుడిని. కాని ఈ పాత్రకి నాటకాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అమెరికా వెళ్లి చదువుకోవాలన్నది కల. అయితే, చివరిసారినాటకం వేయడానికి బళ్లారి వెళ్లాల్సి వస్తుంది. ఆ సంఘటన అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ రకంగా ఆ పాత్ర తన గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి ఆలోచించే క్రమంలో ఆ పాత్ర రూపుదిద్దుకుంటుంది.' అన్నారు.
హీరోయిన్ నయనతార గురించి చెపుతూ... ఈ చిత్రం మొదలు పెట్టినప్పుడు హిరోయిన్ ఎవరని ఏమీ అనుకోలేదు. తరువాత, కథ ముందుకు వెళ్తున్న కొద్ది, హీరోయిన్ పాత్ర కూడా పెరిగింది. ఆప్పుడు, నేను, క్రిష్ కూడా బాగా చేయగలిగినవాళ్ళు ఈ పాత్రకు కావాలనుకున్నాం. నయనతార మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటుంది అని తెలిసింది. అంతే, ఆమె కాకపోతే ఈ పాత్రకు ఇంకెవరూ సరిపోరు అనిపించింది. ఇందులో ఆమె ఓ జర్నలిస్టు. బళ్లారి ప్రాంతానికి వెళ్లి, అక్కడి సమస్యలు తెలుసుకుంటుంది. ఇందులో, ఆమె చేసిన పాత్ర చాలా ముఖ్యమైంది, బలమైంది అన్నారు.