Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'దళం'.. విడుదల తేదీ ఖరారు
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈచిత్రం గత సంవత్సరం డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగ అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చాలా కాలం క్రితమే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో కూడా గత డిసెంబర్లో విడుదలైంది. కానీ ఈ చిత్ర నిర్మాతలు సరైన విడుదల సమయం లేదని పక్కన పెట్టారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన పియాబాజ్పేయ్ నటించింది. జన జీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ల జీవితం తర్వాత ఎలా సాగిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.
దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఆ నలుగురూ... తుపాకీ వదిలేసిన అన్నలు. అడవిలో ఉండి చేసే పోరాటాల వల్ల... తమ లక్ష్యం నెరవేరదని అర్థమైంది. అందుకే.. అడవినీ, ఆవేశాన్నీ, తిరుగుబాటు భావాలనూ విడిచి జన జీవన స్రవంతిలో కలిశారు. ఈ సమాజం వారికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది? వారి జీవితాలపై పోలీసు, రాజకీయ, మీడియా వ్యవస్థల ప్రభావం ఏమిటన్న విషయాలన్నీ మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు .
నిర్మాత సుమంత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ''కథాంశంలోని నవ్యత ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. త్వరలో విడుదల చేస్తాము''అన్నారు. ఇందులోని ప్రత్యేక గీతానికి నథాలియా కౌర్ నర్తించింది. ఈ చిత్రంలో నవీన్చంద్ర, పియాబాజ్పేయ్, కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఛాయాగ్రహణం: సుధాకర్ యక్కంటి, సంగీతం: జేమ్స్ వసంతన్.