Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ CGTR: నిర్మాత ఆశ, విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలకు ఓవర్సీస్లో..ముఖ్యంగా యూఎస్లో క్రేజ్ ఏమిటో 'గబ్బర్ సింగ్' చిత్రంతో రుజువైంది. ఆ చిత్రం అక్కడ ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య యూఎస్లో తానే స్వయంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారీగా లాభాలు వస్తాయనే ఆశతోనే దానయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది.
కాగా....కెమెరామెన్ గంగతో షూటింగ్ పాతబస్తీలోని సిటీ కాలేజీలో వేసిన హాస్పిటల్ సెట్లో జరుగుతుండగా కొంత మంది విద్యార్థి నాయకులు షూటింగును అడ్డుకున్నారు. చారిత్రాత్మకమైన ఈ కాలేజీ శిథిలావస్థకు చేరుకుందని, ఈ కట్టడాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా షూటింగులకు అద్దెకివ్వడం ఏమిటని ఆందోళన చేశారు. ఈ ఆందోళనతో తాత్కాలికంగా చిత్రం షూటింగ్ నిలిపి వేశారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్