twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ CGTR: నిర్మాత ఆశ, విద్యార్థుల ఆందోళన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    పవన్ కళ్యాణ్‌ సినిమాలకు ఓవర్సీస్‌లో..ముఖ్యంగా యూఎస్‌లో క్రేజ్ ఏమిటో 'గబ్బర్ సింగ్' చిత్రంతో రుజువైంది. ఆ చిత్రం అక్కడ ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య యూఎస్‌లో తానే స్వయంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారీగా లాభాలు వస్తాయనే ఆశతోనే దానయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది.

    కాగా....కెమెరామెన్ గంగతో షూటింగ్ పాతబస్తీలోని సిటీ కాలేజీలో వేసిన హాస్పిటల్ సెట్‌లో జరుగుతుండగా కొంత మంది విద్యార్థి నాయకులు షూటింగును అడ్డుకున్నారు. చారిత్రాత్మకమైన ఈ కాలేజీ శిథిలావస్థకు చేరుకుందని, ఈ కట్టడాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా షూటింగులకు అద్దెకివ్వడం ఏమిటని ఆందోళన చేశారు. ఈ ఆందోళనతో తాత్కాలికంగా చిత్రం షూటింగ్ నిలిపి వేశారు.

    ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

    English summary
    Producer DVV Danayya will be releasing his upcoming movie Cameraman Ganga tho Rambabu on his own in USA. Thrilled by Gabbar Singh and Julayi's fantastic trade reports and statistics in the overseas market, the leading producer has decided to release the Pawan Kalyan-starrer in the USA market.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X