Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హాట్ టాపిక్ : 3D లో భారీగా 'కురుక్షేత్రం'
దాసరి మాట్లాడుతూ...''మహాభారతంలోని కురుక్షేత్ర సమరాన్ని తెరకెక్కించాలనేది నా కల. సాధ్యమైనంత త్వరలోనే ఆ కలను సాకారం చేసుకుంటాను. అయిదు భాగాలుగా ఈ కథను తీర్చిదిద్దుతాను. అంతేకాక, అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రీడీలో ఈ అయిదు భాగాలనూ నిర్మించాలనేది నా అకాంక్ష'' అని తెలిపారు.
అలాగే 'భారతాన్ని తీయడం సాధారణమైన విషయం కాదు. తీసే సత్తా ఉన్నా... ఆ పాత్రలను రక్తికట్టించే పాత్రధారులు ఇప్పుడు లేరు అందుకే జాతీయ స్థాయిలో తారలను ఎంపిక చేస్తాం. ఆంగికం, ఆహార్యం, వాచకం... ఇలా అన్ని విషయాల్లోనూ సమర్థులనదగ్గవారిని ఎంచుకొని ఈ కావ్యాన్ని తీస్తాను. చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఈ అయిదు భాగాలు ఉంటాయి'' అని తెలియచేశారు దాసరి.
ఇక ''దర్శకునిగా నాకిది మరో ప్రస్థానం. అందుకే శారీరకంగా, మానసికంగా కూడా సన్నద్ధమవుతున్నాను. దర్శకునిగా నా కలలను, ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనే దృఢ నిశ్చయంతో, కసితో 19 కిలోలు బరువు తగ్గాను. నా సత్తా ఏంటో త్వరలోనే చూస్తారు'' అన్నారు దాసరి.