twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : 3D లో భారీగా 'కురుక్షేత్రం'

    By Srikanya
    |

    Dasari Narayana Rao
    హైదరాబాద్ : త్వరలో తెలుగు ప్రేక్షకులు తమకు ఇష్టమైన మహాభారతాన్ని 3డిలో చూడనున్నారు. 'కురుక్షేత్రం' టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఐదు భాగాలుగా రూపొందనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు రూపొందించనున్నారు. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ విషయమై మీడియాతో దాసరి మాట్లాడి వివరాలు తెలియచేసారు.

    దాసరి మాట్లాడుతూ...''మహాభారతంలోని కురుక్షేత్ర సమరాన్ని తెరకెక్కించాలనేది నా కల. సాధ్యమైనంత త్వరలోనే ఆ కలను సాకారం చేసుకుంటాను. అయిదు భాగాలుగా ఈ కథను తీర్చిదిద్దుతాను. అంతేకాక, అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రీడీలో ఈ అయిదు భాగాలనూ నిర్మించాలనేది నా అకాంక్ష'' అని తెలిపారు.

    అలాగే 'భారతాన్ని తీయడం సాధారణమైన విషయం కాదు. తీసే సత్తా ఉన్నా... ఆ పాత్రలను రక్తికట్టించే పాత్రధారులు ఇప్పుడు లేరు అందుకే జాతీయ స్థాయిలో తారలను ఎంపిక చేస్తాం. ఆంగికం, ఆహార్యం, వాచకం... ఇలా అన్ని విషయాల్లోనూ సమర్థులనదగ్గవారిని ఎంచుకొని ఈ కావ్యాన్ని తీస్తాను. చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఈ అయిదు భాగాలు ఉంటాయి'' అని తెలియచేశారు దాసరి.

    ఇక ''దర్శకునిగా నాకిది మరో ప్రస్థానం. అందుకే శారీరకంగా, మానసికంగా కూడా సన్నద్ధమవుతున్నాను. దర్శకునిగా నా కలలను, ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనే దృఢ నిశ్చయంతో, కసితో 19 కిలోలు బరువు తగ్గాను. నా సత్తా ఏంటో త్వరలోనే చూస్తారు'' అన్నారు దాసరి.

    English summary
    Director Dasari Narayana Rao wants to make a film on Maha Bharatha tited as Kurukshetra. It will be in 3D formet with 5 parts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X