Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దర్శక దిగ్గజం దాసరి ఇకలేరు..గుండెపోటుతో మృతి..
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూశారు. ఆనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరి మంగళవారం తుదిశ్వాస విడిచారు. దాసరి మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయి
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూశారు. ఆనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరి మంగళవారం తుదిశ్వాస విడిచారు. దాసరి మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది.
పత్రిక అధినేతగా దాసరి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4వ తేదీన జన్మించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దాసరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉదయం పత్రికను స్థాపించి పత్రికారంగంలో సంచలనం సృష్టించారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. గుండెపోటు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు అని వైద్యులు మీడియాకు తెలిపారు.
151 చిత్రాలకు దర్శకత్వం..
టాలీవుడ్లో దాసరి 151 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 250 చిత్రాలకు మాటల రచయితగా వ్యవహరించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో నటులను, దర్శకులను పరిచయం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను గిన్నిస్ బుక్ రికార్డుకు చేర్చిన ఘనత దాసరికే దక్కింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో ఆయన నటించారు.
పెద్ద దిక్కు కోల్పోయిన టాలీవుడ్
తారక ప్రభు ఫిలింస్ను స్థాపించి 53 చిత్రాలను నిర్మించారు. రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులను, పలు ఇతర అవార్డులను సొంతం చేసుకొన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించడంలో దాసరిది ప్రత్యేకమైన శైలి. దాసరిగారు ఇకలేరు అంటూ నిర్మాత చిల్లర కల్యాణ్ కన్నీరుమున్నీరయ్యాడు. దాసరి మృతితో చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయింది అని పీఆర్వో ప్రభు రోదించాడు.