Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మైక్ దొరికింది కదా అని వితండవాదం వినిపించిన దాసరి నారాయణ రావు!
రాజశేఖర్, కమలిని ముఖర్జీ జంటగా రూపొందే చిత్రం' మా అన్నయ్య బంగారం" ప్రారంబోత్సవానికి విచ్చేసి అతిరధ మహారధులలో ఒక్కరైన దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రారంభ అనంతరం ఉద్రేకంతో పెద్ద నిర్మాతలపై చిందులు తొక్కారు. ఈ మధ్య హీరో రాజా దాసరి పేరు చెప్పకుండా నలుగురు నిర్మాతల పేర్లు చెప్పి చిన్న సినిమాలను దోచుకుంటున్నారనీ ఆరోపణలు చేసిన క్రమంలో అతనికి మించి ఈ నలుగురు నిర్మాతలపై దాసరి ఈ సంచలన వ్యాఖ్యలు చేయటం అందరికీ ఆర్చర్యంతో పాటు హాస్యాస్పదాన్ని కలిగించింది.
కేవలం మూడు నాలగు కుటుంబాల్లో చిత్రపరిశ్రమ చిక్కుకుందని ప్రముఖ దర్శకుడు దాసరినారాయణరావు అన్నారు. సినీ పరిశ్రమలో కొన్ని కుటుంబాల ఆధిపత్యం సాగుతోందని..మొత్తం సినిమా ఇండస్ట్రీని తమ చేతుల్లో బందీగా ఉంచుకున్నారనీ ఇటువంటి రోజులు పోయే రోజు దగ్గరలోనే ఉందని చెప్పడంతో పాటు తర్వరలో ఆ నలుగురి చేతులోనుండి చిత్ర పరిశ్రమను కాపాడతానని అందరికి అందేలా చేస్తానని దర్శకరత్న దాసరి నారాయణ రావు మైక్ దొరికింది కదా అని వితండవాదం వినిపించాడు.
ఆయన మాటలు విన్నవారు, ఆ నలుగురు కాదయ్యా..చేతిలో పలు నిర్మాణ సంస్థలు ఉంచుకొని, సిరీ మీడియా పేరిట భారీ డిస్ట్రీబ్యూషన్ సంస్థను ఏర్సాటు చేసి ఇటు వెండితెరను అటు బుల్లితెరను దోచుకుంటున్నది..అసలు ముందు చిన్న సినమాలకు జీవితం లేకుండా చేసింది నీవే అనే సంగతి మరిచి మతి తప్పి మాట్లాడుతున్నాడనీ ఆయన పై జోకులేసుకున్నారు.