twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ...ఆ సిఎం ఖర్మ

    By Staff
    |

    Ram Gopal Varma
    ఒకరికి మోదం...మరొకరికి వినోదం అని సినీ కవులు ఊరికినే అనలేదు. ఓ ప్రక్క ముంబయిలో ప్రేలుళ్ళు జరిగి జన జీవనం అల్లకల్లోలం అయితే రామ్ గోపాల్ వర్మ దానిపై సినిమా తీయటానికి అన్నట్లు పర్యటనుకు వెళ్ళాడు. వెళ్తే వెళ్ళాడు అనుకుంటే ఇప్పుడు ఆ మహారాష్ట్ర సిఎం పదివికే ముప్పుతెచ్చాలా కనపడుతున్నాడు. మొత్తానికి ముంబయి ప్రేలుళ్ళ బాంబు ఎఫెక్టు రామ్ గోపాల్ వర్మ రూపంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ పై పడింది.

    ఆయన తాజ్ పర్యటన తీరుపై విమర్శలు అన్ని చోట్ల నుండి భారీగా వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదుల దాడుల్లో ధ్వంసమైన హోటళ్ల సందర్శనకు వెళ్లినపుడు తోడుగా సినీ దర్శక నిర్మాత రాంగోపాల్‌ వర్మను, తన కుమారుడు, నటుడు అయిన రితీష్‌ను వెంటబెట్టుకుని ఓ పిక్నిక్‌కు వెళ్లినట్లుగా కనిపించారంటూ రాజకీయవర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.తాజ్ పరిశరాలు పరిశీలిస్తున్నపుడు ఆయన హావభావాల్లో ఎక్కడా విషాదఛాయలేమీ లేవని, సరదాగా చూడ్డానికి వచ్చినట్లుగా ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు. తాజ్‌తోను, ముంబైతోను సంబంధంలేని పల్లెల్లో కూడా ఈ సంఘటన నేపథ్యంలో విషాదఛాయలు అలముకుంటే, బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏమిటని ఓ వయోవృద్ధుడు నిలదీశారు. మరో ప్రక్క రాంగోపాల్‌ వర్మ ముంబై దాడుల నేపథ్యంలో సినిమా తీస్తారన్న వదంతులు గుప్పుమంటున్నాయి.

    అయితే, తాను రితేష్ వెంట వెళ్లానని, ముఖ్యమంత్రి దేశ్ ముఖ్ తో తనకు పరిచయం లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. రితేష్ వెంట వెళ్లడంలో తప్పేమిటని ఆయన అడిగారు. విలాసరావు తనను గుర్తు పడతారో లేదో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. ముంబయి ఉగ్రవాద దాడులపై సినిమా తీసే ఉద్దేశం తనకు లేదని వర్మ చెప్పారు. విలాసరావు వెంట తాను వెళ్లడం కేవలం యాదృచ్ఛికమేనని ఆయన అన్నారు. అయితే వర్మ ఆయనతో కలసి వెళ్ళకుండా ఉండాల్సిందని,దాంతో ఈ ఘటన వేరే రూపం దాల్చి ఆయన పదివికే ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X