Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గోల్ రీచ్ అయ్యాము.. నిధులు నిల్ అంటోన్న దేవరకొండ ఫౌండేషన్
విజయ్ దేవరకొండ అందరి కంటే ప్రత్యేకమని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ఆర్థిక సాయం చేయకుండా సైలెంట్గా ఉన్నాడేంటి? అంటూ విపరీతంగా ట్రోల్స్ చేశారు. మిగతా హీరోలంతా లక్షలు, కోట్లు విరాళాలు ఇస్తుంటే.. విజయ్ మాత్రం ఇంట్లో కూర్చుని ఉన్నాడని కామెంట్స్ చేశారు. అయితే సాయం చేయడంలోనూ విజయ్ శైలి వేరని మరోసారి నిరూపించుకున్నాడు.
అందరూ పేదవాళ్లం కోసం నిలబడితే.. విజయ్ మాత్రం మధ్య తరగతి వాళ్ల గురించి ఆలోచించాడు. వీరి కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని ఇచ్చి తన ఫౌండేషన్ ద్వారా అందరికీ నిత్యావరసర సరుకులు అందించేలా ప్రణాళిక రూపొందించాడు. తాను మొదటగా ఓ రెండు వేల కుటుంబాలకు సాయం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించానని అయితే ఆ టార్గెట్ను పూర్తి చేసినట్టు తెలిపారు.
తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని, దాతల సాయంలో ఇప్పటి వరకు ఆరువేల కుటుంబాలకు సాయం చేశామని తెలిపారు. అయితే తమకు దాదాపు 77వేల అభ్యర్థనలు వచ్చాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం తమ వద్ద నిధులు అయిపోయాయని, అందుకే ఇక రిక్వెస్ట్లు తీసుకోవడం లేదని, ఆపేశామని ఓ ప్రకటన చేశారు. దయచేసి దాతలు ముందుకు రావాలని, ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయం చేయాలని తద్వార మధ్య తరగతి కుటుంబాలకు సాయం చేసినవారవుతారని పేర్కొన్నారు.