Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
'రాన్జానా': బ్రాహ్మణ అబ్బాయి-ముస్లిం అమ్మాయి
చిత్రంలో తన పాత్ర గురించి సోనమ్ కపూర్ మాట్లాడుతూ... తాజా చిత్రంలో జోయా హైదర్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటించాను. ఇందులో మా నాన్న ఓ ప్రొఫెసర్. నేనంటే ఎంతో ప్రేమ. అందుకే నాకు పూర్తి స్వాతంత్య్రం ఇస్తారు. అయితే నేను ఓ బ్రాహ్మణ అబ్బాయితో ప్రేమలోపడతాను. ఆ తరవాత కథ ఎలా ముందుకు సాగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఎంతో బాగుంది'' అని చెప్పుకొచ్చింది.
'రాంజానా' చిత్రం హిందీలో, 'అంబికాపతి' పేరిట తమిళంలోనూ ఈ రోజు తెరపైకి రానుంది. ధనుష్ తొలిసారిగా నటిస్తున్న హిందీ సినిమా 'రాంజానా'. క్రిష్కలుల్లా నిర్మిస్తున్నాడు. ఆనంద్ ఎల్రాయ్ (తను వెడ్స్ మను దర్సకుడు) తెరకెక్కించారు.
ధనుష్ మాట్లాడుతూ.. తనకు భాష ముఖ్యం కాదని, కథ నచ్చితే చాలని తెలిపాడు. బాలీవుడ్లో క్రమం తప్పక నటిస్తానని అక్కడొకటి, ఇక్కడొకటి చొప్పున కెరీర్ కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఆ మేరకు ప్రస్తుతం మరో హిందీ కథకు పచ్చజెండా ఊపాడు.
ఈ కొత్త చిత్రం కూడా 'రాంజానా' దర్శకుడు ఆనంద్ ఎల్రాయ్ నిర్దేశకత్వంలోనే రూపొందనుండటం విశేషం. కథ నచ్చటంతోనే మళ్లీ ఆయన చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని ధనుష్ సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.