Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఆది' తో ఎన్టీఆర్ స్టార్ , ఇప్పుడు 'బృందావనం' తో ... దిల్ రాజు
ఆది ఎన్టీఆర్ ని స్టార్ను చేస్తే, సింహాద్రి సూపర్స్టార్ను చేసింది. ఈ బృందావనం ఆయన అంతస్తును మరింత పెంచి, కొత్త ఇమేజ్ను తీసుకు వస్తుంది అన్నారు దిల్ రాజు. ఎన్టీఆర్ తో ఆయన రూపొందించిన తాజా చిత్రం బృందావనం మారిన రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఆయన అలా స్పందించారు. అలాగే బృందావనం.. ఫ్యామిలీ ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గర చేస్తుందీ చిత్రం. రెండేళ్ల క్రితం ఎన్టీఆర్కి ఈ చిత్రకథ చెప్పాడు వంశీ. అప్పటినుంచి ఈ కథమీద వర్కవుట్ చేశాం.
సాధారణంగా మా చిత్రాల రీరికార్డింగ్ 15,16 రోజులు చేస్తాం. కానీ ఈ సినిమాలో నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత ఉండటంతో 29 రోజులు చేశాం అన్నారు. వంశీ, సంగీత దర్శకుడు తమన్ కూర్చుని మ్యూజిక్ బోర్డ్లా తయారు చేసుకుని రీరికార్డింగ్ చేస్తున్నారు. అలాగే ఛాయాగ్రాహకుడు చోటా కె.నాయుడు 14 నెలలుగా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేయడంతో సినిమా బాగా వచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో తొలి కాపీ వస్తుంది. ఈ నెల 14న విడుదల చేస్తాం. సినిమా చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటారు' అన్నారు. కాజల్, సమంతా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.