Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విద్యుత్ తరంగంలా, నడిచే నిప్పు కణంలా రవితేజ
రవితేజ..విద్యుత్ తరంగంలా, నడిచే నిప్పు కణంలా తమ తాజా చిత్రం 'డాన్ శీను' లో కనిపించనున్నారని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్తున్నారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. సహ నిర్మాత వి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ..."రవితేజ నటనే ఈ సినిమాకు ప్రధాన బలం. ఇటీవలే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. మణిశర్మ చక్కని మ్యూజిక్ ఇచ్చారు. 'కిక్' తర్వాత మా ఆర్.ఆర్.మూవీమేకర్స్లో వస్తున్న మరో పూర్తిస్థాయి వినోదభరిత చిత్రం 'డాన్ శీను' అన్నారు. శ్రియ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, అంజనా సుకాని, మహేష్ మంజ్రేకర్, డా.బ్రహ్మానందం, షయాజీ షిండే, అలీ, యాశ్ పాల్ శర్మ, వేణుమాధవ్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రానికి కథనం, మాటలు: కోన వెంకట్, కెమెరా: సమీర్రెడ్డి, కో-డైరెక్టర్: తరణీరావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.