Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలంగాణా నాయకులను పోలిన పాత్రలతో సినిమా
నేటి తెలంగాణ ఉద్యమంలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న నాయకులను పోలిన పాత్రలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. వర్తమానంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమంతోపాటు, చరిత్రలో జరిగిన తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా ఈ చిత్రంలో ఉంటుంది అంటున్నారు దర్శకుడు ఎన్.శంకర్. ఆయన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో, అందర్నీ ఆకట్టుకునే అంశాలతో ఒక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ విశేషాలను తెలపటానికి గురువారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యూనివర్సల్ అంశాలతో రూపొందే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాం అన్నారు.
అలాగే నేను గతంలో చేసిన చిత్రాలన్నీ ఏదో ఒక నేపథ్యంతో రూపొందినవే. తెలంగాణ లోని కన్న తల్లుల కడుపు కోతకు నిలువుటద్దంగా 'ఎన్ కౌంటర్' తీశాను. రాయలసీమలోని వాస్తవిక అంశాలకు ప్రతిబింబంగా 'శ్రీరాములయ్య' రూపొందించాను. యమలోకం గురించి ఎంతో పరిశీలన చేసి 'యమజాతకుడు', జ్యోతీరావు పూలే స్ఫూర్తితో 'జయం మనదేరా', గోదావరిలాంటి మనసున్న ఓ అమాయకుడి కథా నేపథ్యంలో 'భద్రాచలం', పేద ప్రజల తిరుగుబాటును ఆవిష్కరిస్తూ 'ఆయుధం', సమసమాజస్థాపనను ఆకాంక్షిస్తూ 'రామ్' చిత్రాలు రూపొందించాను అన్నారు.
ఇక ఈ కొత్త చిత్రం మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందనీ, ప్రజాకవులు, కళాకారుల సేవలు వినియోగించుకుంటాంమనీ తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో రూపొందించే చిత్రమైనప్పటికీ అన్ని ప్రాంతాల వారూ ఈ చిత్రానికి పనిచేస్తారు. ఇది తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిఫలించే చిత్రమే తప్ప ఎవరి మనోభావాలనూ అగౌరవపరిచే చిత్రం కాదు. గతంలో నేను రూపొందించిన చిత్రాలన్నీ సామాజిక అంశాలకు కమర్షియల్ విలువలను జోడించి రూపొందించినవే, ఈ చిత్రమూ వాటి సరసన నిలిచే చిత్రమే అవుతుంది. హీరో, హీరోయిన్, హీరో తల్లి పాత్రలు ప్రధాన పాత్రలుగా ఉండే ఈ సినిమాలో మొత్తం 64 కేరెక్టర్లుంటాయి. ఈ పాత్రలన్నిటినీ కొత్తవారి చేత ధరింపజేయాలని అనుకుంటున్నాను. దీనికోసం ఒక ఛానెల్ సహకారంతో ఆడిషన్ జరుపనున్నాను. ఒక కమిటీ మా చిత్రంలో నటించే నటీనటులను ఎంపిక చేస్తుంది' అన్నారు.