Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టెక్నో థ్రిల్లర్ అనే కాన్సెప్ట్తో వస్తున్న ‘ఐతే 2.0’
హైదరాబాద్: 'బుషి', 'ఆంధ్రాపోరి' వంటి డిఫరెంట్ చిత్రాలతో అలరించిన దర్శకుడు రాజ్ మాదిరాజు దర్శకత్వంలో 'ఐతే 2.0' సినిమా రూపొందనుంది. ఫర్మ్9 బ్యానర్పై రూపొందుతోన్న ఈ చిత్రానికి హేహంత్ వళ్ళపు రెడ్డి, రవి.ఎన్.రధి, విజయ్రామరాజు నిర్మిస్తున్నారు. టెక్నో థ్రిల్లర్ అనే కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందనుంది.
ఈ సినిమా గురించి దర్శకడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ ''ఇప్పటి వరకు డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించిన నేను టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్తో 'ఐతే 2.0' చిత్రాన్ని రూపొందించబోతున్నాను. ఇప్పటి యూత్ ఎక్కువగా మొబైల్స్, ల్యాప్ టాప్స్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియాతోనే తమ సమయాన్ని గడిపేస్తూ పరిసరాలను కూడా పట్టనట్టుగా ఉండే యువతను కూడా ఒకరు గమనిస్తుంటారు. వారెవరు? ఈ సోషిల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయనే విషయాన్ని మా ఐతే 2.0 మూవీ చూపెట్టబోతున్నామన్నారు.
ఈ కాలం యువతకు కావాల్సిన ఓ మెసేజ్ను కూడా ఇందులో అందిస్తున్నాం. ఈ సినిమా టైటిల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘ఐతే' అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. గుణ్ణం గంగరాజుగారితో మాట్లాడి టైటిల్ గురించి అడిగితే తన అంగీకరించారు. అందుకే ఈ సినిమాకి ఐతే 2.0 అనే టైటిల్ పెట్టాం. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. నటీనటులు వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.