Just In
- 21 min ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 1 hr ago
బ్లాక్లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
- 2 hrs ago
షూటింగ్కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
Don't Miss!
- News
వైఎస్ జగన్ పట్ల పాజిటివ్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: టీడీపీకి కౌంటర్?,‘తిరుపతి’ కోసం సోము భేటీ
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆశపడొద్దు..అలాంటిదేమీ లేదంటూ డైరక్టర్ ఖండించేసాడు
హైదరాబాద్ : దగ్గుపాటి వెంకటేష్, రానా కంబినేషన్ లో మనం తరహాలో ఓ మల్టిస్టారర్ రాబోతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని క్షణం దర్శకుడు రవికాంత్ పేరేపు డైరక్ట్ చేస్తున్నారని సైతం నిన్నంతా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఖండించారు రవికాంత్.
రవికాంత్ మాట్లాడుతూ.. "నేను దగ్గుపాటి హీరోలకు ఏ స్క్రిప్టునూ నేరేట్ చెయ్యలేదు. నేను ప్రస్తుతం రాస్తున్న స్క్రిప్టుని ఫినిష్ చేసే పనిలో ఉన్నాను...త్వరలోనే నా తదుపరి చిత్రం ఎనౌన్సమెంట్ వస్తుంది ", అన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రానా కు ఈ దర్శకుడు ఓ కథని నేరేట్ చేసాడని, అయితే ఆ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదాని తెలియాలి. అయితే అది మల్టిస్టారర్ కథ మాత్రం కాదని వినికిడి.
ఇక ప్రస్తుతం రానా..బాహుబలి 2 బిజీలో ఉన్నారు. దాంతో పాటు రానా హీరోగా నటించిన 'ఘాజీ' చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ రెండు వెర్షన్స్ కి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.

భారీ నిర్మాణ విలువలతో జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి "అండర్ వాటర్" పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు.
ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే సినిమా కావడంతో, సహజత్వం కోసం కొంతమంది పాకిస్తాన్ రంగస్థల నటులను కూడా తీసుకున్నారట.ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ గా నటించాడు. ఈ పాత్రలో సహజత్వాన్ని తీసుకురావడానికి ఆయన సీనియర్ నేవీ అధికారుల సలహాలను .. సూచనలను తీసుకుని ఈ పాత్రను పోషించడం విశేషం.
1971లో జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి "పి.ఎన్.ఎస్. ఘాజీ" ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగా ముంచి వేశారు. ఆ ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని చేస్తున్న సినిమా "ఘాజీ". ఈ చిత్రంలో కోస్ట్ గార్డ్స్లో ఎస్-21 అనే నౌకాదళ అధికారి పాత్రను రానా పోషిస్తున్నారు. ''ఇది ఒక అద్భుతమైన వాస్తవ కథ