రాబోయే రోజులన్నీ 'హ్యేపీడేస్': శేఖర్ కమ్ముల
ప్రతి ఒక్కరూ 'లీడర్'గా మారితే రాబోయే రోజులన్నీ 'హ్యేపీడేస్' అని సినీదర్శకుడు శేఖర్కమ్ముల అన్నారు. ఆయన బేగంపేట హోటల్ పార్చూన్ మనోహర్ లో ఘట్కేసర్ మెగా మహిళా ఇంజినీరింగ్ కళాశాల 'ఫ్రెషర్స్డే' కి. ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన విద్యార్థి జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా విధ్యార్దులును ఉద్దేశ్సించి మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ తమలోని సృజనాత్మకతను వెలికితీస్తే అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు.ఇక అదే పంక్షన్ కి అటెండయిన హీరో నవదీప్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితంలో పైకి ఎదగాలని కోరారు. అనంతరం నవదీప్ విద్యార్థినులతో కలిసి స్టెప్పులేశారు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రం ప్రమేషన్ లో బిజీగా ఉంటున్నారు. అలాగే నవదీప్ హీరోగా చేసిన యాగం చిత్రం క్రిందటి వారం రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











