Just In
- 26 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 57 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
Don't Miss!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రముఖ నటి, దర్శకురాలు వైశాలి కాసరవల్లి మృతి
ప్రముఖ కన్నడ నటి, దర్శకురాలు, ఫ్యాషన్ డిజైనర్ వైశాలి కాసరవళ్లి (59) సోమవారం సాయంత్రం బెంగుళూరులో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా షుగర్, మరియు తీవ్రమైన మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నారు. చనిపోయే ముందు ఆమె నేత్ర దానం చేశారు. ప్రఖ్యాత దర్శకుడు గిరీష్ కాసరవల్లి ఆమె భర్త. 'తాయిసాహేబా' చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డు అందుకున్నారు. కర్ణాటక నాటక అకాడమీ, రాజ్యోత్సవ అవార్డులు కైవసం చేసుకున్నారు. మొత్తం 73 చిత్రాల్లో నటించిన ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. రెండు కన్నడ సీరియల్స్కూ దర్శకత్వం వహించారు.
1952 ఏప్రిల్ 12న గుల్బర్గలో జన్మించిన వైశాలి...బూతయ్యన మగ అయ్యు ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. శాంతినివాస ఆమె చివరి చిత్రం.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు విల్సన్ గార్డెన్లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి మూడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని రవీంద్రా కళాక్షేత్రలో ఉంచుతారు. వైశాలి మృతి పట్ల ముఖ్యమంత్రి యడ్యూరప్ప, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటులు పునీత్ రాజ్కుమార్, శివ రాజ్కుమార్ తదితరులు వైశాలికి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మృతికి ధట్స్ తెలుగు ప్రగాఢ సంతాపం తెలియచేస్తోంది.