దర్శకుడు విక్రం గాంధీ ఇక లేరు
శివాజీ స్టేట్ రౌడీ, వేణుమాధవ్ ప్రేమాభిషేకం చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు ఎస్.ఎస్.విక్రమ్ గాంధీ(45) ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంత కాలంగా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన గన్నవరంలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

వందకు పైగా చిత్రాలకు కో డైరెక్టర్ గా వర్క్ చేసిన గాంధీ తర్వాత తన దర్శకత్వంలో స్టేట్ రౌడీ, ప్రేమాభిషేకం చిత్రాలను తెరకెక్కించారు. ఈయన అంత్యక్రియలు రేపు గన్నవరంలో జరగనున్నాయి. గాంధీ మరణంపై తెలుగు చిత్రపరిశ్రమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











