'నువ్వు వస్తావని' దర్శకుడు వి.ఆర్. ప్రతాప్ మృతి
తెలుగు సినిమా దర్శకుడు వి.ఆర్.ప్రతాప్ కాన్సర్ తో పోరాడుతూ మృతి చెందారు. ఆయన గత కొద్ది నెల రోజులుగా కాన్సర్ తో ట్రీట్ మెంట్ తీసుకుంటూ పరిస్దితి సీరియస్ కావటంతో తెనాలిలోని ఆయన స్వగృహంలో మరణించారు. ఆయన పూర్తి పేరు వంకినేని రత్న ప్రతాప్. ఆయన నాగార్జునతో రూపొందించిన నువ్వు వస్తావని చిత్రంతో పరిచయమయ్యారు. అలాగే ఎన్టీఆర్ ని పరచయం చేస్తూ నిన్ను చూడాలని చిత్రం రూపొందించారు. ఆయన చివరి చిత్రం..రాజశేఖర్ హీరోగా వచ్చిన కన్నడ రీమేక్ గోరింటాకు. సెంటిమెంట్ తో వచ్చిన ఆ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ధట్స్ తెలుగు ఆయన మరణానికి నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











