Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ హీరోల దోస్తానా కంటిన్యూ చేస్తున్నారు
కరుణ్ జోహార్ నిర్మాణంలో ఆ మధ్య వచ్చి హిట్టయిన దోస్తానా చిత్రంకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సారి కూడా అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహమ్ లు ఈ చిత్రంలో మగ జంటగా చేస్తున్నారు. అయితే హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఉండకపోవచ్చునని తెలుస్తోంది. మొదటి చిత్రంలాగానే ఇది కూడా మిస్ అండర్ స్టాండిగ్స్ మధ్య నడిచే కామిడీగా తెరకెక్కుతుందని కరణ్ చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఈ వేసవిలో షూటింగ్ మొదలవుతుంది. ఈ విషయాలను కరణ్ తన ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. ఇక కరణ్ జోహార్ తన లేటెస్ట్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్ హిట్టుతో చాలా సంతోషంగా ఉన్నారు. తమ ధర్మా ప్రొడక్షన్స్ లో వరసగా సినిమాలు చేస్తాను అంటున్నారు. ఇక ప్రస్తుతం కరుణ్ దృష్టి మొత్తం స్టెప్ మామ్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంపైనే ఉంది. కాజల్,కరీనా కపూర్, అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో చేస్తున్నారు. ఈ కథతో మన తెలుగులో జగపతి బాబు, ఆమనిలతో ఎస్వీ కృష్ణారెడ్డి మావిచిగురు అనే చిత్రం రూపొందించి హిట్ కొట్టారు. అలాగే ఇదే ప్రొడక్షన్స్ పై ఇమ్రాన్ ఖాన్, సోనం కపూర్ కాంబినేషన్ లో వస్తున్న ఐ హేట్ లవ్ స్టోరీస్ అనే చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.