Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీదేవి మరిదే మొట్టమొదటగా, ఫోర్సెనిక్ రిపోర్ట్ లో ఏముంది..దుబాయ్ మీడియాలో కుదుపు!
Recommended Video
శ్రీదేవి మరణం యావత్ సినీ అభిమానులని కలచివేస్తోంది. సమ్మోహనపరిచే అందం, ఆకట్టుకునే నటనతో దశాబ్దాలపాటు అలరించిన శ్రీదేవి ఉన్నపళంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో సినీప్రముఖులు, ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి మృతికి ప్రాధమిక కారణం ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురికావడమే. కాగా శ్రీదేవి మృతికి మరేమైనా కారణాలు ఉన్నాయని అనే విషయం తెలియాలంటే ఫోర్సెనిక్ రిపోర్ట్ రావలసిందే.
మేనల్లుడి పెళ్లి కోసం
కొన్ని రోజుల క్రితం శ్రీదేవి కుటుంబం తన మేనల్లుడి వివాహానికి హజాయ్యేందుకు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ శ్రీదేవి అనుకోని విధంగా మృతేవాత పడ్డారు. తన కుటుంబాన్ని అభిమానులని తీరనిశోకంలో ముంచారు.
తేరుకునేలోపే అంతా
హోటల్ గదిలోని బాత్ రూమ్ లో శ్రీదేవి కుప్పకూలిపోయారు. బాత్ రూమ్ నుంచి ఎలాంటి అలికిడి లేకేపోవడంతో భర్త బోనీ కపూర్ అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.
మొట్టమొదటగా శ్రీదేవి మరిదే
శ్రీదేవి మరణ వార్తని మీడియాకు మొట్టమొదట తెలియజేసింది ఆమె మరిది సంజయ్ కపూర్. వారి కుటుంబం మొత్తం ప్రస్తుతం దుబాయ్ లోనే ఉన్నారు. శ్రీదేవి మరణించిన కొద్దీ సేపటి తరువాత సంజయ్ కపూర్ దుబాయ్ లోని ఖలీజ్ టైమ్స్ పత్రికకు ఈ విషయాన్ని తెలియజేసారు.
తరలింపు పనుల్లో బిజీగా
సంజయ్ కపూర్ ప్రస్తుతం తన వదిన పార్థివ దేహాన్ని ఇండియా కు తరలించే పనిలో బిజీగా ఉన్నారు. శ్రీదేవి పార్థివ దేహం ముంబైకు చేరుకున్న తరువాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
దుబాయ్ మీడియాలో కుదుపు
శ్రీదేవి మరణ వార్తతో దుబాయ్ మీడియా కుదుపుకు లోనయ్యింది. అక్కడి మీడియా సంస్థల్లో శ్రీదేవి వార్తే ప్రధాన అంశంగా మారింది. శ్రీదేవి జ్ఞాపకాలని దుబాయ్ మీడియా మొత్తం గుర్తుచేసుకుంది.
శ్రీదేవి నామస్మరణ
ఇండియాకు వలె దుబాయ్ మీడియా కూడా శ్రీదేవి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఆమె సాధించిన విజయలన్ని అక్కడి మీడియా సంస్థల్లో హైలైట్ అయ్యాయి.
చాందిని గోస్ ఆఫ్
దుబాయ్ ప్రముఖ పత్రిక ఖలీజ్ టైమ్స్ లో శ్రీదేవి పెద్ద చిత్రాన్ని ప్రచురించి చాందిని గోస్ ఆఫ్ అనే టైటిల్ కూడా పెట్టేసారు. శ్రీదేవి మారిన వార్తకు ఆ సంస్థ అధికప్రధాన్యత ఇవ్వడం విశేషం.
50 ఇయర్స్ ఆఫ్ లివింగ్ సినిమాటిక్ డ్రీమ్
గల్ఫ్ టైమ్స్ కమ్యూనిటీ పత్రికలో శ్రీదేవి చిత్రాన్ని పేజీ మొత్తం ప్రచురించారు. 50 ఇయర్స్ ఆఫ్ లివింగ్ సినిమాటిక్ డ్రీమ్ అనే హెడ్డింగ్ కూడా పెట్టేసారు. శ్రీదేవి ఖ్యాతి ఖండాంతరాలు దాటిందనేదానికి ఇదే ఉదాహరణ.
ఫోర్సెనిక్ రిపోర్ట్
శ్రీదేవి పార్థివ దేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఫోర్సెనిక్ రిపోర్ట్ లో ఏముందని విషయం అంతటా ఉత్కంఠగా మారింది. శ్రీదేవి భౌతిక ఖాయాన్ని దుబాయ్ నుంచి తరలిస్తున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. శ్రీదేవి మరణానికి గల పూర్తి కారణాలు త్వరలోనే తెలియనున్నాయి.