Don't Miss!
- News గేదెల మందులమ్మేవాళ్లు వైసీపీకి సర్వే చేశారంట?
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫిల్మ్ ఫెస్టివల్ లో రఘుకుంచె 'ఎడారి వర్షం'
ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా,కేరళ ప్రభుత్వం కలిపి సంయుక్తంగా నిర్వహించే 'సైన్స్' అంతర్జాతీయ లఘుచిత్రోత్సవాల ఫెస్టివల్ లోని ఫోకస్ సెక్షన్లో ఎంపికైన నలబై రెండు చిత్రాలలోని ఫోకస్ సెక్షన్లో స్థానం సంపాదించుకున్న ఏకైన తెలుగు చిత్రం "ఎడారివర్షం". ప్రముఖ సంగీత దర్శకుడు రుఘుకుంచె ప్రధాన పాత్రలో రూపొందిన ఈ లఘు చిత్రం రీసెంట్ గా ప్రదర్శితమై అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ఇక తెలుగు ఇండిపెండెంట్ సినిమా బ్యానర్ పై కోఅపరేటివ్ పధ్దతిలో ఒక ఫేస్ బుక్ గ్రూపు నుంచీ కొందరు ఔత్సాహికుల కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుండీ కేరళలోని పాలక్కాడ్ లో ప్రారంభమయ్యే ఈ అంతర్జాయచిత్రోత్సవంలో ప్రదర్శింపబడుతుంది.
ప్రముఖ కవి, రచయిత బాలగంగాధర్ తిలక్ "ఊరి చివర ఇల్లు" కథ ప్రేరణతో నిర్మించిన ఈ చిత్రానికి కత్తిమహేష్ కుమార్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు. రాఘు కుంచె, స్వప్న, ప్రమీలారాణి నటించారు. కెమెరా కమలాకర్, సంగీతం రాజశేఖర శర్మ అందించిన ఈ చిత్రాన్ని దాదాపు ముప్పైమంది కలిసి నిర్మించారు. ఫేస్ బుక్ లో కలిసిన ముప్పై ఎనిమిది మంది నిర్మాతల సహకారంతో ఇది సాధ్యమైందని ఆయన చెప్తున్నారు. రెండున్నర లక్షల బడ్జెట్ లో మూడు రోజుల షూటింగ్ తో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం రఘుకుంచె ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందిస్తున్న దేముడు చేసిన మనుష్యులు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.