Don't Miss!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
పీఎం నరేంద్రమోదీకి షాక్.. ఓటర్లపై ప్రభావం.. ఎన్నికల తర్వాతే..
Recommended Video
ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న పీఎం నరేంద్రమోదీ నిర్మాతలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని చేసుకొన్న రిక్వెస్టును ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఏప్రిల్ 17న ఏడుగురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం అధికారుల బృందం సినిమాను చూసింది. అనంతరం సినిమా రిలీజ్ గురించి ఏప్రిల్ 22న నివేదికను ఈసీకి అందజేసింది. ఈ సినిమా రిలీజ్ గురించి ఏమన్నారంటే..
సెన్సార్ బోర్డు అనుమతిచ్చినా..
పీఎం నరేంద్రమోదీ బయోపిక్కు సెన్సార్ బోర్డు ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున సినిమా రిలీజ్పై ఆంక్షలు విధించాలని కొందరు కోర్టులో పిటిషన్ వేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. దాంతో ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పీఎం నరేంద్రమోదీకి మరోసారి ఝలక్
తాజాగా ఈసీ ఆదేశాల ప్రకారం.. పీఎం నరేంద్రమోదీ చిత్రాన్ని మే 19వ తేదీ తర్వాతే రిలీజ్ చేయాలి. లోక్సభ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగే ప్రయోజనాలను నిర్మాతలు దృష్టిలో పెట్టుకోవాలి. అందుచేత ఎన్నికలు ముగిసిన తర్వాత సినిమా రిలీజ్కు ఏర్పాట్లు చేసుకోవాలి అని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నది.
పీఎం నరేంద్రమోదీ సినిమా బయోపిక్ కాదుని
పీఎం నరేంద్రమోదీ సినిమా బయోపిక్ కాదు. రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించి తీసిన చిత్రం (hagiography). అధికార బీజేపీ ప్రభుత్వ ప్రభావం ఎన్నికలపై పడుతుంది. ఓటర్లపై ప్రభావం చూసే అవకాశం కనిపించింది. అందుచేత సినిమాను ఎన్నికలు ముగిసేంత వరకు నిలిపివేయాలని ఈసీ అభిప్రాయపడింది అని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక తన కథనంలో పేర్కొన్నది.
ఎన్నికల తర్వాతే రిలీజ్
ప్రధాని మోదీ జీవితంలోని కీలక అంశాలను తీసుకొని పీఎం నరేంద్రమోదీ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించగా, ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కావాల్సింది. అయితే రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే కారణంతో ఎన్నికల సంఘం ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది. ఈసీ తాజా ఆదేశాలతో ఈ సినిమా ఎన్నికల తర్వాత రిలీజ్ కానున్నది.