Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రతినా, కరీనా మధ్య వేడి చల్లారిందా?
బాలీవుడ్ టాప్ హీరోయిన్లు క్రతినా కైఫ్, కరీనా కపూర్ మధ్య మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇండస్ట్రీలో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్న ఈ ఇద్దరు....ఒకరిపై ఒకరు సెటైర్లు, విమర్శలు చేసుకున్న సందర్భాలు అనేకం. ఒకరు నటించే సినిమాలో మరొకరు సెకండ్ హీరోయిన్ గా నటించడానికి అస్సలు ఇష్ట పడేవారు కాదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య చిచ్చు చల్లారినట్లే కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ బాడీగార్డు సినిమాలో ఈ ఇద్దరిలో ఒకరు హీరోయిన్ పాత్ర చేస్తుండగా, మరొకరు ఐటం నెంబర్ గా కనిపించబోతున్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన లాక్మె ఫ్యాషన్ వీక్ లో వీరు..రాసుకుపూసుకు తిరగడంపై వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.
ఈ షోలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు వేసుకున్న కరీనా..షో టాపర్ గా నిలచింది. ఇదే కార్య్రక్రమానికి గెస్ట్ గా హాజరైంది కత్రినా. ఈ ఇద్దరు మద్దులతో కలిసి ర్యాంప్ వాక్ చేశాడు మనీష్. ఈ సీన్ చూసి ఆ కార్య్రకమానికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా ఒకరు...మీరిద్దరు మళ్లీ ఫ్రెండ్స్ అయ్యారా? అంటూ క్రతినాను అడగ్గా.. మేము ఎప్పటి నుంచో మంచి స్నేహితులం.. మీకెందుకు ఆ డౌట్ వచ్చిందంటూ ఎదురు ప్రశ్నించిందట అమ్మడు.
దీన్ని బట్టి బాలీవుడ్ లో శాశ్వత మిత్రులు, శాశ్వత శ్రతువులు ఉండనే వాదన వినిపిస్తోంది హిందీ జనాల నుంచి...