twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్న మంత్రి ఏరాసు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న ఏరాసు ప్రతాపరెడ్డి.... హరిశ్చంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆపరేషన్ దుర్యోధన-2' చిత్రంలో ముఖ్యమంత్రి రోల్ చేస్తున్నారు. ఈ మేరకు తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు ఏరాసు. బుధవారం హైదరాబాద్ లో ఈ డబ్బింగ్ కార్యక్రమం జరిగింది. నిజ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం మంత్రిగారికి ఉందో? లేదో? కానీ సినిమాలో మాత్రం ఆ కల నెరవేరబోతోంది.

    జగపతి బాబు, సోనియా అగర్వాల్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రధారులుగా నీలాంజన, చిన్నాప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. సమకాలీన రాజకీయాలకు అద్దంపట్టే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రూపొందుతోంది. ఈనెల 19న రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఎవరినీ ఉద్దేశించి ఈ చిత్రాన్ని నిర్మించలేదని, మంచివాళ్లను చెడ్డవాళ్లుగా, చెడ్డవాళ్ళను మంచివాళ్లుగా ఈ చిత్రంలో చూపడం లేదని తెలిపారు. కోట శ్రీనివాసరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: ప్రసాద్‌బాబు, నిర్మాతలు: ఎ.బి.శ్రీనివాస్, జిట్టా సురేందర్ రెడ్డి, దర్శకత్వం : హరిశ్చంద్రరావు.

    English summary
    State Law Minister Erasu Pratap Reddy has dubbed his voice for the film ‘Operation Duryodhana 2’, which is for the first time he is doing. ‘Operation Duryodhana 2’ is the mirror reflection of today’s politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X