Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'ఢీ', 'బన్నీ' చిత్రాల నిర్మాత అరెస్టు.. చంచలగూడా జైలుకు
మంచు విష్ణు వర్ధన్, జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ డీ చిత్రం గుర్తుండే ఉంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రాన్ని నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. అలాగే వివివినాయిక్,అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన బన్నీ, రవి తేజ,రసూల్ తో చేసిన భగీరధ చిత్రాలు కూడా ఆయనే నిర్మించారు. ఆయన్ని గురువారం అరెస్టు చేసి, చెంచలగూడా జైలుకు తరలించినట్లు సీబీఐ ఎస్పీ హెచ్.వెంకటేష్ మీడియాకు వెల్లడించారు. ఓ బ్యాంక్ను మోసం చేసిన కేసులో గత ఏడాది జనవరిలో దోషిగా తేలిన సత్యనారాయణరెడ్డి అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు పట్టుకున్న సీబీఐ అధికారులు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష నిమిత్తం చంచల్ గూడ జైలుకు తరలించారని చెప్పారు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన తన కుమారుడు వెంకట్ హీరోగా గీత రచయిత కులశేఖర్ దర్శకత్వంలో ప్రేమలేఖ రాసా అనే చిత్రాన్ని రెండేళ్ళ క్రితం రూపొందించారు. అయితే అదే ఆయన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో నెట్టేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి పన్నెండు లక్షల రూపాయలు తీసుకుని తిరిగి చెల్లించలేకపోయారు. దాంతో వారు కోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్ళిన ఈ కేసులో సత్యనారాయణ రెడ్డి నేరం రుజువై శిక్ష ఖరారు అయింది. అయితే ఆయన జనవరి నుంచి తప్పించుకు తిరుగుతూ లేటెస్ట్ గా పట్టుబడ్డారు.