Don't Miss!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇది ప్రభుత్వం చేసే మోసంకాదా? డ్రగ్స్ ని చట్టబద్దం చేయండి: రామ్గోపాల్ వర్మ
‘కేవలం ఆదాయం కోసమే సిగరెట్, ఆల్కహాల్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం డ్రగ్స్ను మాత్రం చట్టవిరుద్ధంగా ఎందుకు చూస్తోంది. డ్రగ్స్ను కూడా చట్టబద్ధం చేయవచ్చు కదా:
టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన డ్రగ్స్ కేసులో ఒక పక్క విచారణ జరుగుతూంటే ప్రతీ విషయంలోనూ తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉన్నాడు. ఈ వివాదాస్పద దర్శకుడు డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై మరోసారి విరుచుకు పడ్డాడు.
తెలంగాణా ప్రతిష్టకే భంగం
డ్రగ్స్ విచారణ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమందిని విచారిస్తున్న తీరుతో మొత్తం తెలంగాణా ప్రతిష్టకే భంగం కలిగిందంటూ మాట్లాడి ఇప్పటికే విమర్శల పాలైన వర్మ ఇంకా తన పద్దతి మాత్రం వీడలేదు. అదే దారిలో తన మానాన తాను మాట్లాడుతూ పోతూనే ఉన్నాడు.
Recommended Video
హైదరాబాద్ స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారం
పూరీ జగన్నాధ్ సహా సినిమా వారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విచారణపై వర్మ మండిపడుతూనే ఉన్నాడు. విచారణ అంటూనే లేనిపోని లీకులను బయటకు ఇస్తుండటాన్ని వర్మ ఖండించాడు.పంజాబ్ స్కూల్స్లో జరుగుతున్నట్లుగానే తెలంగాణ, హైదరాబాద్ స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారం జరుగుతోందని ముంబై వాసులు భావిస్తున్నారని అన్నాడు.
కేసీఆర్కున్న మంచి పేరును చెడగొట్టేలా
డ్రగ్స్ కేసు విచారిస్తున్న సిట్.. హైదరాబాద్, టీఆర్ఎస్, కేసీఆర్కున్న మంచి పేరును చెడగొట్టేలా వ్యవహరించవద్దని వర్మ చెప్పగానే ఆయన టీవీ 9 ఇంటర్వ్యూని సమర్థించిన వాల్లే ఈ విషయం లో వర్మని సమర్థించలేక పోయారు. అయినా వర్మ ఇప్పుడు మళ్ళీ డ్రగ్స్పై ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని వర్మ తప్పుపట్టాడు.
చట్టబద్ధం చేస్తే తప్పేంటి?
సిగరెట్, ఆల్కహాల్లాగానే డ్రగ్స్ను కూడా చట్టబద్ధం చేస్తే తప్పేంటి అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. ‘కేవలం ఆదాయం కోసమే సిగరెట్, ఆల్కహాల్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం డ్రగ్స్ను మాత్రం చట్టవిరుద్ధంగా ఎందుకు చూస్తోంది. డ్రగ్స్ను కూడా చట్టబద్ధం చేయవచ్చు కదా
ప్రభుత్వం చేసే మోసం కాదా
అలాచేస్తే ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్తానికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా! నిజానికి ఆల్కహాల్ను సప్లై చేస్తూ ప్రజలను తాగుబోతులుగా మార్చి వారి ఆరోగ్యాలను చెడగొడుతోంది ఎక్సైజ్ శాఖే. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఆల్కహాల్ను అనుమతించడం మోసం కాదా' అని వర్మ ప్రశ్నించారు.