Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెండితెరపై 'గబ్బర్ సింగ్' కూతురు
హిందీ చిత్రాల్లో విలన్ పాత్రలను పోషిస్తూ కూడా ప్రేక్షకుల గుండెల్లో హీరో స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అంజాద్ ఖాన్. 'గబ్బర్ సింగ్' అంటూ వంద కోట్ల రూపాయలు గుమ్మరించిన పవన్ కల్యాణ్ సినిమాలోని ఈ పాత్ర వెనుక ఉన్న అసలు గబ్బర్ సింగ్ ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు 'షోలే' చిత్రంతో బాలీవుడ్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి మహానటుడి వారసురాలు కూడా వెండి తెరపై తళుక్కున మెరవనుంది.
అంజాద్ ఖాన్ కుమార్తె అయిన అహ్లమ్ తన మొదటి చిత్రంతో హిందీ చిత్రపరిశ్రమలో కాలుమోపనున్నది. తాను చిత్రపరిశ్రమకు ఇప్పుడు పరిచయం అవుతున్నప్పటికీ నాటక రంగంలో ఎప్పటి నుంచో ఉన్నానని అంటోంది అహ్లమ్. రచయిత, దర్శకుడు మకరంద్ దేశ్పాండే నాటకం 'మిస్ బ్యూటిఫుల్'ని ఆయనే నిర్మాతగా తెరకెక్కించనున్నారు. హిందీలో 'మిస్ సుందరి'గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అహ్లమ్ నటించనుంది.
ఈ చిత్రాన్ని, తక్కువ బడ్జెట్తో తెరకెక్కుతున్న దీన్ని వ్యాపార దృష్టితో నిర్మించడంలేదని అంటున్నారు. మకరంద్. 'మిస్ బ్యూటిఫుల్' నాటకంలోని ఈ పాత్రను అహ్లమ్ పలుమార్లు పోషించిందని, సినిమాలో కూడా ఈమెను కాకుండా మరొకరిని వూహించలేనని అంటున్నారీయన. ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి అయిన అహ్లమ్ ఈ చిత్ర ప్రచారంలో కూడా పాలుపంచుకుంటుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చిలో ప్రేక్షకులను అలరించనుంది.