Don't Miss!
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సమంత, గౌతమ్ మీనన్ కాంబినేషన్ నెక్స్ట్ చిత్రం రిలీజ్ డేట్...
నాగచైతన్యతో 'ఏమాయ చేసావె' చిత్రం రూపొందించి విజయం సాధించిన గౌతమ్ మీనన్ తన తదపరి చిత్రం 'ఎర్ర గులాబీలు' విడుదలకు రంగం సిద్దమైంది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మించిన 'ఎర్ర గులాబీలు' చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. సమీరారెడ్డి ప్రధాన పాత్రధారి అయిన ఈ చిత్రంలో కథకి కీలకమైన మరో పాత్రని సమంత చేసింది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అని అభివర్ణిస్తున్నారు.
ఇక ఈ చిత్రం గురించి నిర్మాత అశోక్ మాట్లాడుతూ "'ఏ మాయ చేసావె' తర్వాత గౌతమ్ మీనన్ రూపొందించిన చిత్రం. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ మధ్యనే జరిగిన ఓ సంఘటనని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీశారు. సెన్సార్ వాళ్లు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికే తెలుగు చిత్రసీమలో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొని ఉంది. ఆ అంచనాలను మించేట్లుగా ఉంటుంది ఈ చిత్రం'' అని చెప్పారు.
కార్తీక్, వీరా హీరోలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: రంగనాథ్ రావే, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఆంథోని, కళ: రాజీవన్, ఫైట్స్: శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. వేణుగోపాల్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.