twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత, గౌతమ్ మీనన్ కాంబినేషన్ నెక్స్ట్ చిత్రం రిలీజ్ డేట్...

    By Srikanya
    |

    నాగచైతన్యతో 'ఏమాయ చేసావె' చిత్రం రూపొందించి విజయం సాధించిన గౌతమ్ మీనన్ తన తదపరి చిత్రం 'ఎర్ర గులాబీలు' విడుదలకు రంగం సిద్దమైంది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మించిన 'ఎర్ర గులాబీలు' చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. సమీరారెడ్డి ప్రధాన పాత్రధారి అయిన ఈ చిత్రంలో కథకి కీలకమైన మరో పాత్రని సమంత చేసింది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అని అభివర్ణిస్తున్నారు.

    ఇక ఈ చిత్రం గురించి నిర్మాత అశోక్ మాట్లాడుతూ "'ఏ మాయ చేసావె' తర్వాత గౌతమ్ మీనన్ రూపొందించిన చిత్రం. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ మధ్యనే జరిగిన ఓ సంఘటనని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీశారు. సెన్సార్ వాళ్లు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికే తెలుగు చిత్రసీమలో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొని ఉంది. ఆ అంచనాలను మించేట్లుగా ఉంటుంది ఈ చిత్రం'' అని చెప్పారు.

    కార్తీక్, వీరా హీరోలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: రంగనాథ్ రావే, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఆంథోని, కళ: రాజీవన్, ఫైట్స్: శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. వేణుగోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.

    English summary
    The censor formalities of Samantha’s latest flick ‘Erra Gulabeelu’ have been completed. The film acquired ‘A’ certificate and is set for February 18th release. ‘Erra Gulabeelu’ stars Sameera Reddy, Karthik, Veera and Samantha in lead roles. The story, screenplay and direction were handled by Gautham Vasudev Menon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X