పాప బ్రతికేది అంటూ హేమమాలిని ఆవేదన
ముంబై : ఇటీవల రాజస్థాన్లోని దౌసా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నటి, భాజపా ఎంపీ హేమమాలిని గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ... ఓ చిన్నారి మృతి చెందిది. హాస్పటిల్ నుంచి డిఛ్చార్జ్ అయిన హేమమాలిని ఈ విషయమై చాలా మానసిక వేదన అనుభవించారు. ఆమె ట్విట్టర్ లో ఆ ప్రమాదం జరిగిన తీరుపై మండిపడ్డారు. ఆమె ఏం అందో ఇక్కడ చూడండి.

ప్రమాద ఘటనపై హేమమాలిని ట్విట్టర్లో ప్రస్తావిస్తూ... చిన్నారి తండ్రి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉంటే ప్రమాదం తప్పేదని, పాప బతికుండేదని పేర్కొన్నారు. ప్రమాదంలో పాప చనిపోవడం తనను కలచివేసిందన్నారు.
ప్రస్తుతం హేమమాలిని సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే తనకు ప్రమాదం జరిగినప్పుడు తన అభిమానులు చాలా మంది తన క్షేమం కోసం చేసిన ఫోన్స్, మెసేజ్ లు మర్చిపోలేనన్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
నా క్షేమం కోసం మీరు చేసిన ప్రార్దనలు ఫలించాయని అన్నారు.
ఈ ప్రమాదంతో తనను ఎంతగా అభిమానించే వాళ్లు ఉన్నారో మరోసారి తెలిసింది అన్నారు.
మీకందరికి నా కృతజ్ఞతలు అని ఆమె మనస్పూర్తిగా తెలిపారు.
అయితే ఆ సమయంలో మీడియా వ్యవహించిన తీరుని మాత్రం ఆమె తప్పుపట్టారు.
మీడియా వ్యవహించిన తీరు..సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని షేమ్ అని అన్నారు.


Click it and Unblock the Notifications











