Don't Miss!
- News హైదరాబాదు వాసులకు కూల్ న్యూస్.. పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
హేమా మాలినిపై...కుమార్తెను పోగొట్టుకున్న తండ్రి మండిపాటు
న్యూ ఢిల్లీ: ఇటీవల రాజస్థాన్లోని దౌసా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నటి, భాజపా ఎంపీ హేమమాలిని గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ... ఓ చిన్నారి మృతి చెందిది. హాస్పటిల్ నుంచి డిఛ్చార్జ్ అయిన హేమమాలిని ఈ విషయమై చాలా మానసిక వేదన అనుభవించారు.
ప్రమాద ఘటనపై హేమమాలిని ట్విట్టర్లో ప్రస్తావిస్తూ... చిన్నారి తండ్రి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉంటే ప్రమాదం తప్పేదని, పాప బతికుండేదని పేర్కొన్నారు. ప్రమాదంలో పాప చనిపోవడం తనను కలచివేసిందన్నారు.
అయితే తాను ట్రాఫిక్ నియమాలు పాటించలేదని హేమమాలిని చేసిన ఆరోపణలను ప్రమాద సమయంలో ఆల్టో కారు నడుపుతున్న హనుమాన్కుమార్ తోసిపుచ్చారు. దౌసా వద్ద తన కుమార్తెను బలిగొన్న ఆ ప్రమాదం జరగడానికి ముందు తాను ఇండికేటర్ వేశానని, తన ముందు మరో వాహనం కూడా ఉందని ఆయన చెప్పారు. నిముషంన్నర వేచి చూశాక రోడ్డు ఖాళీగా కనిపించిన తర్వాతే తాను బయలుదేరానని వివరించారు.
She
is
a
big
name
but
must
atleast
think
before
speaking-Father
of
girl
who
died
in
Dausa
accident
on
Hema
Malini
pic.twitter.com/bjqOmhEfVs
—
ANI
(@ANI_news)
July
8,
2015
ఏ ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘించానో చెప్పాలని హనుమాన్ ప్రశ్నించారు. ప్రమాదంలో తన కూతురు చనిపోయిన సంగతి తెలిసి కూడా హేమమాలిని ఇంతవరకు ఫోన్లో కూడా పరామర్శించలేదని ఆయన గుర్తు చేశారు.