Don't Miss!
- News వైసీపీలోకి జనసేన కోనసీమ కీలక నేత..!!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
గోపీచంద్ ‘పంతం’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'ఫర్ ఎ కాజ్' అనేది సబ్ టైటిల్. గతంలో పవర్, జై లవకుశ చిత్రాలకు రచయితగా పని చేసిన కె చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడు పరిచయం అవుతున్నాడు. మెహ్రీన్ హీరయిన్. ఇందులో ఆమె స్కూల్ టీచర్ పాత్రలో కనిపించబోతోంది.
కెరీర్లో 25వ చిత్రం కావడంతో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
విజయవాడలో జూన్ 21న ఆడియో విడుదల కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఆ తర్వాత వైజాగ్లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపనున్నారు. ఈ చిత్రంలో పృధ్వి, జయప్రకాష్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంగీతం: గోపీ సుందర్ కెమెరా: ప్రసాద్ మూరెళ్ల ఆర్ట్: ఏఎస్ ప్రకాష్ మాటలు: రమేష్ రెడ్డి స్క్రీన్ ప్లే: కె చక్రవర్తి, బాబీ(కెఎస్ రవీంద్ర) కో డైరెక్టర్: బెల్లంకొండ సత్యం బాబు ప్రొడ్యూసర్: కెకె రాధా మోహన్ స్టోరీ, డైరెక్షన్: కె. చక్రవర్తి( చక్రి).