Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అటు రామ్ చరణ్, ఇటు గుణశేఖర్ కెలుకుతున్నారు
గత కొద్ది రోజులుగా పరిశ్రమ వర్గాల్లోను,టీవీ చానెల్స్ లోనూ హాట్ టాపిక్ గా రామ్ చరణ్, గుణశేఖర్ నిలుస్తున్నారు. వీరిద్దరికీ వేర్వేరు టాపిక్ లతో హాట్ టాపిక్ గా మారారు. మన సినిమాల్లో నటిస్తున్న పరభాషా హీరోయిన్లు ఫంక్షన్స్ హాజరు కావడానికి నిరాకరిస్తున్నారన్న డా.దాసరి విమర్శకు రాంచరణ్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదు, హీరోయిన్లు బాగానే వస్తున్నారని కామెంట్ చేసేసరికి పూర్తి దుమారం రేగింది. దాసరి విమర్శపై కామెంట్ చేసే స్థాయి రాంచరణ్కి లేదని ఓ వర్గం ధ్వజమెత్తింది. ఇది టీవీ ఛానెల్లో కూడా గంటపాటు చర్చకి దారి తీసింది. అందరూ మర్చిపోయిందనుకున్న దాన్ని కెలుక్కున్నట్లైందని రామ్ చరణ్ ని అందరూ అన్నారు.
ఇది జరిగిన మరుసటి రోజునే ఎంఎస్రెడ్డి 'నాకథ" పుస్తకంలో దర్శకుడు గుణశేఖర్ మీద చేసిన కామెంట్స్ హైల్ ట్ గా మారాయి. మహేష్ తో చేసిన'ఒక్కడు" సినిమా తనతో చేస్తానని మాటిచ్చిన గుణశేఖర్ మాట తప్పాడని ఎంఎస్రెడ్డి ఆరోపిస్తూ పుస్తకంలో రాసారు. దీనికి స్పందించిన గుణశేఖర్ దీన్ని ఎంఎస్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నాడు. ఇది ఆయన నా కథ అనే చెప్పారు గానీ ఆత్మకథ అని చెప్పలేదు. కనుక ఆత్మపెట్టి ఈ పుస్తకం రచించలేదు. కేవలం కథలు అల్లుకున్నారు అని కొట్టిపారేశాడు. అలా గుణశేఖర్ వెంటనే ఆ పెద్దాయన్ని ఏకి పారేసాడు. అస్సలు ఆ పుస్తకాన్ని మార్కెట్లో నుంచి తీసేసే ప్రయత్నాల్లో ఎమ్.ఎస్ రెడ్డి కుమారుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఉండగా గుణశేఖర్ ఇలా కెలికి దాన్ని హైలెట్ చేసారు. అదీ సంగతి.