నరేష్ మూడో భార్యకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్తో ఏమవుతారో తెలుసా? వారి బంధుత్వం ఇదే!
టాలీవుడ్ నటుడు మాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ ఆయన మూడో భార్య రమ్య రఘుపతి మధ్య విభేదాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మైసూర్ లో ఒకే హోటల్ గదిలో ఉన్న నరేష్, పవిత్ర లోకేష్ మీద దాడి చేయడానికి కూడా రమ్య రఘుపతి వెనుకాడకుండా చెప్పు విసిరిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఆమెకు ప్రశాంత్ నీల్ కు మధ్య ఉన్న బంధుత్వం వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రశాంత్ నీల్ కు
పవిత్ర లోకేష్ మాజీ భర్తగా చెబుతున్న సుచేంద్ర ప్రసాద్తో ఒక మహిళ మాట్లాడిన ఆడియోలు కన్నడ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో మహిళ మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ కు రమ్య రఘుపతికి బంధుత్వం ఉందనే విషయాన్ని వెల్లడించడంతో అది నిజమే కదా అని తెలుగు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. గత కొద్దిరోజుల క్రితమే ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి ఉన్న బంధుత్వం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

అన్నదమ్ములు అవుతారని
ఇప్పుడు రమ్య రఘుపతి కూడా రఘువీరారెడ్డి కుటుంబానికి చెందిన వారే అని తెలియడంతో అసలు వీరిద్దరి మధ్య చుట్టరికం ఏమిటి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ప్రశాంత్ నీల్ రమ్య రఘుపతికి సోదరుడవుతాడని తెలుస్తోంది. ఆయన ఆమెకు అన్నయ్య అవుతారట. ఎలా అంటే రఘువీరారెడ్డి రమ్య తండ్రి వరుసగా అన్నదమ్ములవుతారట. అలాగే ప్రశాంత్ నీల్ తండ్రి రఘువీరారెడ్డి కూడా అన్నదమ్ములవుతారట. ఈ లెక్కన చూసుకుంటే ప్రశాంత్ నీల్ తండ్రి రమ్య తండ్రి కూడా అన్నదమ్ములు అవుతారని తెలుస్తోంది.

విడిపోవాల్సిన పరిస్థితులు
ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ రమ్యకు అన్నయ్య అవుతాడు అనే విషయం బయటకు వచ్చింది. రమ్య రఘుపతి సినిమాల మీద ఉన్న ఆసక్తితో విజయ నిర్మల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో అప్పటికే రెండు వివాహాలు చేసుకుని విఫలమైన నరేష్ తో ప్రేమలో పడ్డారు. పెద్దలు కూడా వీరి వివాహానికి ఓకే చెప్పడంతో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి 9 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

విడాకులు ఇవ్వకూడదు అని
తనకు విడాకులు ఇవ్వమని నరేష్ కోరుతుంటే చనిపోయే ముందు విడాకులు ఇవ్వకూడదు అని విజయనిర్మల మాట తీసుకున్నారు కాబట్టి తాను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అని రమ్య రఘుపతి అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో ఇంకా ఎన్ని రోజులు పాటు ఈ వివాదం కొనసాగుతుందో అనే విషయం మీద చర్చ జరుగుతోంది.

వివాదాస్పదమయ్యారు
బెంగళూరులో ఉన్న హోటల్ మోతీ మహల్ చాలా ఫేమస్ ఈ ఫేమస్ హోటల్ కు ఓనర్ రమ్య రఘుపతి తండ్రి అని తెలుస్తోంది. మరి అంత డబ్బున్న తండ్రి ఉన్నా సరే రమ్య రఘుపతి ఎందుకు చిన్న చిన్న మొత్తాలు కూడా అప్పులుగా తీసుకుని వివాదాస్పదమయ్యారు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











