హీరో గోపీచంద్ బామ్మ మృతి

గోపీచంద్కు సంబంధించిన సినిమాల వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం గోపీచంద్ బి.గోపాల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్. నిర్మాత తాండ్ర రమేష్, జయబాలాజీ రియల్ మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''ఓ వీరుడి పోరాటం... ఈ చిత్రం. అతని ప్రయాణం ఎందుకోసమో తెరపై చూస్తే తెలుస్తుంది. ఈ యాక్షన్ చిత్రంలో ప్రేమ భావనలకూ చోటుంది. గోపీచంద్, నయనతార జంట ఆకట్టుకొంటుంది''అని దర్శకుడు చెప్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.
ఈ చిత్రం ద్వారా విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. బి.గోపాల్ దర్శకత్వంలో ఆమె గతంలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాలు చేసింది. ఆ అనుభంధంతో కథను మలుపుతిప్పే పాత్ర చేస్తోందని చెప్తున్నారు. అలాగే గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వంలోనూ ఆమె ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి చిత్రాలు చేసింది.
గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో మాస్ని, క్లాస్ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు.


Click it and Unblock the Notifications











