Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వ్యభిచారం నడిపినట్లే చేసారు: మీడియాపై హీరోయిన్ ఫైర్
అసలు
జరిగింది
ఏమిటంటే...
దీప్తి
నావల్
నటించిన
'లిజన్
అమాయా'
అనే
హిందీ
చిత్రం
విడుదలకు
కొన్ని
రోజుల
ముందు
ఆ
చిత్రంలో
నటించిన
దీప్తి
నావెల్,
ఫరూక్
షేర్
సినిమా
ప్రమోషన్లో
భాగంగా
ముంబైలోని
ఆమె
నివాసంలో
రాజీవ్
మసంద్
అనే
వ్యక్తికి
ఇంటర్వ్యూ
ఇచ్చేందుకు
ప్లాన్
చేసుకన్నారు.
ఈ
మేరకు
రాజీవ్
మసంద్
తన
ముగ్గురు
కెమెరా
మేన్ల
టీంతో
పాటు
ఆమె
నివాసానికి
చేరుకున్నారు.
అయితే ఆమె నివాసం ఉంటున్న హౌసింగ్ సొసైటీ వారు ఇక్కడ సినిమా షూటింగులు చేయవద్దని ఆమెతో గొడవకు దిగారు. అయితే ఇది సినిమా షూటింగ్ కాదని, ఇంటర్వ్యూ మాత్రమే అని ఆమె వారికి చెప్పినా వినలేదు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరిగి సొసైటీ వారు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది వ్యవహారం.
ఆ తర్వాత ఆమె తన జర్నలిస్టు స్నేహితుడికి జరిగిన గొడవ గురించి ఫోన్లో తెలియజేసింది. నేనేదో వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు హౌసింగ్ సొసైటీ వారు నా పట్ల అమర్యాదగా ప్రవర్తించారని జర్నలిస్టుకు తెలియజేసింది. దీంతో సదరు జర్నలిస్టు 'నేను వ్యభిచార రాకెట్ నడపటం లేదు' అనే టైటిల్ తో జరిగిన విషయాన్ని ఆమె మాట్లల్లో వార్తలా పబ్లిష్ చేసారు.
ఆ తర్వాత ఇతర మీడియా సంస్థల వారు ఇదే అంశానికి తమ సొంత కవిత్వం జోడించి వేరే రకంగా ఎక్స్ ఫోజ్ చేయడం ప్రారంభించారు. పరిస్థితి ఎలా తయారైందంటే దీప్తి నావెల్పై వ్యభిచార రాకెట్ నడిపిన ఆరోపణలు వచ్చినట్లు, ఆమె దాన్ని ఖండించినట్లు అనే రితీలో అసలు విషయాన్ని తప్పుతోవ పట్టించారు.
మీడియా తీరుపై మనస్థాపం చెందిన దీప్తి నావల్ జరిగిన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మీడియా వారికి సినీతారలు, వ్యభిచారం అనే అంశాలంటే మహా మక్కువ. ఈ రెండు అంశాలు వారి చేతికి దొరికితే దాన్నో సెన్సేషన్ చేస్తారు, వారికి వాస్తవాలు అక్కరలేదు అంటూ ఘాటుగా విమర్శించారు.