Just In
- 24 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోజులు మారాయి: ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాత మారుతి!
హైదరాబాద్: ఈ మద్య తెలుగులో వరుస సక్సెస్ లతో దూసుకెలుతున్న ఫిల్మ్ మేకర్ మారుతి. దర్శకుడిగా నిర్మాతగానే కాదు....రచయితగా కూడా మారుతి తన సత్తా చాటుతున్నాడు. త్వరలో విడుదల కానున్న రోజులు మారాయి చిత్రానికి రైటర్ ఈయనే. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకి రైటర్ గా మంచి పారితోషికం పుచ్చుకున్న మారుతి.. లాభాల్లో కూడా వాటా అందుకోబోతున్నాడట.
మరో వైపు రాజ్ తరుణ్ హీరోగా ప్రారంభం కానున్న 'రాజుగాడు' అనే సినిమాకి కూడా మారుతి స్క్రిప్ట్ అందించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం నిర్మాతల నుంచి కోటికి పైగా చెక్ ను అందుకున్నాడట. ఇప్పటి వరకు ఈ రేంజి రెమ్యూనరేషన్ అందుకున్న రచయిత త్రివిక్రమ్ మాత్రమే. ఆయన తర్వాత మారుతి మాత్రమే కేవలం రయితగా కోటికిపైగా రెమ్యూరేషన్ అందుకున్నాడని అంటున్నారు.

మారుతి తాజా సినిమా 'రోజులు మారాయి' జులై 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మారుతి సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. 'రోజులు మారాయి' కథ రియల్ లైప్ ఆధారంగా జరిగిన సంఘటన నుండి తయారు చేసిందే అన్నారు.
ఓసారి పేపర్లో లవ్, రిలేషన్ షిప్స్లో అమ్మాయిలు ఓ అబ్బాయిని చంపేశారని చదివాను. ఆ ఆర్టికల్ చదువుతుంటే రోజులుమారాయి కథ నా ఆలోచనకు వచ్చింది. ఆ ఆర్టికల్ను ఫన్నీగా మలుచుకుంటూ నేను, డైరెక్టర్ మురళి, రైటర్ రవి కలిసి ఆ పాయింట్ను డెవలప్ చేశామని మారుతి తెలిపారు.