Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
రోజులు మారాయి: ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాత మారుతి!
హైదరాబాద్: ఈ మద్య తెలుగులో వరుస సక్సెస్ లతో దూసుకెలుతున్న ఫిల్మ్ మేకర్ మారుతి. దర్శకుడిగా నిర్మాతగానే కాదు....రచయితగా కూడా మారుతి తన సత్తా చాటుతున్నాడు. త్వరలో విడుదల కానున్న రోజులు మారాయి చిత్రానికి రైటర్ ఈయనే. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకి రైటర్ గా మంచి పారితోషికం పుచ్చుకున్న మారుతి.. లాభాల్లో కూడా వాటా అందుకోబోతున్నాడట.
మరో వైపు రాజ్ తరుణ్ హీరోగా ప్రారంభం కానున్న 'రాజుగాడు' అనే సినిమాకి కూడా మారుతి స్క్రిప్ట్ అందించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం నిర్మాతల నుంచి కోటికి పైగా చెక్ ను అందుకున్నాడట. ఇప్పటి వరకు ఈ రేంజి రెమ్యూనరేషన్ అందుకున్న రచయిత త్రివిక్రమ్ మాత్రమే. ఆయన తర్వాత మారుతి మాత్రమే కేవలం రయితగా కోటికిపైగా రెమ్యూరేషన్ అందుకున్నాడని అంటున్నారు.
మారుతి తాజా సినిమా 'రోజులు మారాయి' జులై 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మారుతి సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. 'రోజులు మారాయి' కథ రియల్ లైప్ ఆధారంగా జరిగిన సంఘటన నుండి తయారు చేసిందే అన్నారు.
ఓసారి పేపర్లో లవ్, రిలేషన్ షిప్స్లో అమ్మాయిలు ఓ అబ్బాయిని చంపేశారని చదివాను. ఆ ఆర్టికల్ చదువుతుంటే రోజులుమారాయి కథ నా ఆలోచనకు వచ్చింది. ఆ ఆర్టికల్ను ఫన్నీగా మలుచుకుంటూ నేను, డైరెక్టర్ మురళి, రైటర్ రవి కలిసి ఆ పాయింట్ను డెవలప్ చేశామని మారుతి తెలిపారు.