Don't Miss!
- News రేపు కామద ఏకాదశి.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
లంచంపై పోలీసులకు అమీర్ ఖాన్, సెన్సార్ ఆఫీసర్ అరెస్ట్
ముంబై: లంచం అడిగితే ఎంతటి వారిపైన అయినా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పష్టం చేసారు. సినిమా సెన్సార్ సందర్భంగా తాను ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వ లేదని తెలిపారు. ఇటీవల సెంట్రల్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డ్ సీఈఓ రాకేష్ కుమార్ లంచం తీసుకుంటూ అరెస్టయిన నేపథ్యంలో అమీర్ ఖాన్ పై విధంగా స్పందించారు.
ఛత్తీస్గడ్కు చెందిన ఓ ప్రాంతీయ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడానికి రూ. 70 వేల లంచం అడిగారనే ఆరోపణలతో రాకేష్ కుమార్ ఇటీవల అరెస్టు అయ్యారు. అయితే రాకేష్ కుమార్ లంచం వ్యవహారంపై స్పందించడానికి అమీర్ ఖాన్ నిరాకరించారు. తన వద్ద అతను ఎప్పుడూ లంచం అడగలేదని, అందుకే ఈ విషయమై తాను స్పందించబోనని అమీర్ ఖాన్ స్పష్టం చేసారు.
అమీర్
ఖాన్
తాజా
సినిమా
'పి.కె'
విషయానికొస్తే....
అమీర్
ఖాన్
తాజా
సినిమా
'పి.కె'కు
సంబంధించి
ఇటీవల
విడుదలైన
న్యూడ్
లుక్
వివాదాస్పదం
అయిన
సంగతి
తెలిసిందే.
కేసు
కూడా
బుక్
అయింది.
దీనిపై
అమీర్
ఖాన్
మాట్లాడుతూ...తాను
పబ్లిసిటీ
కోసం
అలా
చేయలేదని,
సినిమా
చూస్తే
మీకు
పూర్తిగా
అర్థమవుతుందని
తెలిపారు.
ఆగస్టు
20న
విడుదలయ్యే
పోస్టర్లో
రేడియో
కూడా
అడ్డం
ఉండదని
చెప్పిన
అమీర్
ఖాన్...సెకండ్
పోస్టర్లో
నిండుగా
బట్టలేసుకుని
దర్శనమిచ్చాడు.
రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.